పాతబస్తీలో చిన్నారుల అక్రమ రవాణా.. 5గురు అరెస్టు
హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో చిన్నారుల అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన ముఠా కలకలం రేపింది. ఏప్రిల్ 20న గాంధీ విగ్రహం సమీపంలో ఐదేళ్ల బాలిక మరియం సాది కిడ్నాప్కి గురైంది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన చాంద్రాయణగుట్ట పోలీసులు, సీసీటీవీ ఆధారంగా నిందితులను గుర్తించి ఓ ఇంటిపై దాడి చేశారు.దంపతులు జావీద్ పాషా (51), షాయిస్థా పర్వీన్ (40) లను అరెస్ట్ చేయగా, వారు బాలికను పర్వీన్ భాను అనే మహిళకు రూ.1.30 లక్షలకీ అమ్మినట్టు వెల్లడించారు. వెంటనే పోలీసులు ఉప్పల్లో బాలికను రక్షించారు. ఆ సమయంలో సునీత కుమారి మరియు కప్పల రాజేంద్ర ప్రసాద్ కు బాలికను మరలా విక్రయించే ప్రయత్నం జరుగుతున్న సమయంలో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.ఇతర వివరాల ప్రకారం, రాజేంద్ర ప్రసాద్ జీడిమెట్లలో నివసించే కార్మికుడు కాగా, సునీత ఉప్పల్లో ఒక చిన్న ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ నడుపుతోంది. వీరిద్దరిపై ఇప్పటికే ముంబయిలో విక్రోలి పోలీస్ స్టేషన్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. ఈ గ్యాంగ్ పిల్లల అక్రమ రవాణా కోసం వ్యవస్థాబద్ధంగా పని చేస్తూ ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సీజ్ చేసిన వస్తువులు:
-
ఓన్డా యాక్టివా బైక్ (TS 07 EC 2745)
-
ఆటో రిక్షా (TS 11 UC 3481)
-
ఆల్టో కారు (AP 11 Q 8917)
-
5 మొబైల్ ఫోన్లు
-
₹76,000 నగదు