తెలంగాణలో పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు.. పరుగులు పెట్టిన జనాలు

By Ravi
On
తెలంగాణలో పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు.. పరుగులు పెట్టిన జనాలు

తెలంగాణ ఉత్తర ప్రాంతంలోని జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో భూమి కంపించింది. ఈ పరిణామంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలోని వస్తువులు కదలడం, భూమి కొద్ది సెకన్ల పాటు కంపించడంతో ఏం జరుగుతుందో తెలియక భయంతో బయటకు పరుగులు తీశారు. జిల్లా వ్యాప్తంగా ప్రకంపనల ప్రభావం ఎక్కువగా కనిపించింది. జిల్లాలోని చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లో భూమి కొన్ని క్షణాల పాటు తీవ్రంగా కంపించినట్లు స్థానికులు తెలిపారు. ఇళ్లు, భవనాలు కూడా కంపించాయని వారు చెప్పారు. కొందరు స్థానికులు రెండు సార్లు భూమి తీవ్రంగా కంపించిందని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయని సమాచారం. భూమి కంపించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. కొందరు ఇండ్లు వదిలి భయంతో బయటకు పరుగులు తీశారు.

Tags:

Advertisement

Latest News

ఇకపై వెబ్ సైట్ లో జడ్జిల ఆస్తుల వివరాలు.. ఇకపై వెబ్ సైట్ లో జడ్జిల ఆస్తుల వివరాలు..
తాజాగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తన వెబ్ సైట్ లో న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు, నియామక వివరాలను అప్ లోడ్ చేసింది. న్యాయ వ్యవస్థను పెంపొందించే...
దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్.
పీఎం మోదీతో అజిత్ దోవల్ మీటింగ్.
కెప్టెన్సీ పై కోహ్లీ సెన్సేషనల్ కామెంట్స్
గిల్‌ కు కెప్టెన్సీ భారం కాదు: విక్రమ్‌
ఐపీఎల్ పై హైదరాబాద్‌ టీమ్ హెడ్‌ కోచ్‌
రోహింగ్యాలను వెంటనే తరలించాలని డిమాండ్‌..!