మహ్మద్‌ షమీకి హత్య బెదిరింపులు..

By Ravi
On
మహ్మద్‌ షమీకి హత్య బెదిరింపులు..

భారత పేసర్ మహ్మద్ షమీకి హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్ ద్వారా హత్య బెదిరింపులు పంపిన దుండగులు.. రూ.కోటి డిమాండ్‌ చేశారు. ఈ విషయాన్ని షమీ సోదరుడు హసీబ్ తాజాగా ఓ నేషనల్ మీడియాకు తెలిపాడు. ఆదివారం మధ్యాహ్నం 2-3 గంటల సమయంలో మెయిల్ వచ్చిందని, వెంటనే ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాం అని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజ్‌పుత్ సిందార్‌ అనే వ్యక్తి మెయిల్‌ పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. తాజాగా టీమిండియా హెడ్ కోచ్‌ గౌతమ్ గంభీర్‌ కు కూడా బెదిరింపులు వచ్చాయి. 

ఐ కిల్‌ యూ అంటూ ఈ మెయిల్స్‌ వచ్చినట్లు ఢిల్లీ పోలీసులకు గౌతీ ఫిర్యాదు చేశాడు. 2023 ప్రపంచ కప్ తర్వాత గాయం కారణంగా మహ్మద్ షమీ టీమిండియాకు దూరమయ్యారు. ట్రీట్ మెంట్ తర్వాత చాలా కాలం పాటు విశ్రాంతి తీసుకుని ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమయంలో భారత జట్టులోకి తిరిగి వచ్చాడు. ఐదు మ్యాచ్‌ ల్లో తొమ్మిది వికెట్లు పడగొట్టి.. ఈ టోర్నమెంట్‌ లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా నిలిచాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025 సీజన్‌ లో హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు.

Advertisement

Latest News

ఓబుళాపురం మైనింగ్ కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన నాంపల్లి సీబీఐ కోర్టు.. 5గురికి శిక్ష..ఇద్దరికి క్లీన్ చిట్ ఓబుళాపురం మైనింగ్ కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన నాంపల్లి సీబీఐ కోర్టు.. 5గురికి శిక్ష..ఇద్దరికి క్లీన్ చిట్
ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లిసీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. సుదీర్ఘ విచారణ అనంతరం 15ఏళ్ల తర్వాత ఈ కేసులో మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా...
మహేశ్వరం మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రోడ్డుకు అడ్డంగా ప్రహరీ నిర్మాణం.. నేలమట్టం చేసిన హైడ్రా
అల్కాపురి కాలనీలో సిలిండర్ బ్లాస్ట్.. 15 గుడిసెలు దగ్ధం
సంధ్య మినీ కన్వెన్షన్ హాల్ ని నేలమట్టం చేసిన హైడ్రా
ఫెడరల్ నిధులు నిలిపివేసిన ట్రంప్
వైద్య రంగంలో మిరాకిల్.. అక్కడ రోబోలే డాక్టర్లు..