ఐపీఎల్ పై హైదరాబాద్‌ టీమ్ హెడ్‌ కోచ్‌

By Ravi
On
ఐపీఎల్ పై హైదరాబాద్‌ టీమ్ హెడ్‌ కోచ్‌

 2025 సీజన్‌ లో భాగంగా తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో సన్‌ రైజర్స్‌ ప్లేఆఫ్స్‌ ఆశలు ఆవిరయ్యాయి. ఈ మ్యాచ్‌ లో ఫస్ట్ బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. తర్వాత రెయిన్ రావడంతో హైదరాబాద్‌ కు బ్యాటింగ్‌ చేసే అవకాశమే రాలేదు. ఈ సీ జన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన ఎస్‌ఆర్‌హెచ్‌ కేవలం మూడింట్లో మాత్రమే విజయం సాధించి ప్లేఆఫ్స్‌ రేసు నుంచి తప్పుకుంది. ఈ మ్యాచ్‌ తర్వాత టీమ్ మెయిన్ కోచ్‌ డానియల్‌ వెటోరి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. మేం ప్రతి మ్యాచ్‌ దూకుడుగా ఆడాలని అనుకోలేదు. ఈ సంవత్సరం పరిస్థితులు మేం ఊహించిన విధంగా లేవు. గత సంవత్సరం మనం చాలా హైస్కోరింగ్‌ మ్యాచ్‌లు చూశాం. కానీ ఈసారి కాస్త భిన్నంగా ఉంది. హైదరాబాద్‌ పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలించలేదు. రెండు పిచ్‌లు 250+ స్కోర్లకు వీలుగా ఉంటే.. నాలుగు పిచ్‌లు ఫాస్ట్‌ బౌలర్లకు అనుకూలంగా ఉన్నాయి. అదే సమయంలో స్పిన్నర్లకు సపోర్ట్ చేయలేదు. కొత్త బంతిని కొట్టడం బ్యాటర్లకు ఇబ్బందిగా మారింది. బంతి బ్యాట్‌ మీదకు రాలేదు అని వెటోరి ఎక్స్ ప్లైన్ చేశారు.

Advertisement

Latest News

ఓబుళాపురం మైనింగ్ కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన నాంపల్లి సీబీఐ కోర్టు.. 5గురికి శిక్ష..ఇద్దరికి క్లీన్ చిట్ ఓబుళాపురం మైనింగ్ కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన నాంపల్లి సీబీఐ కోర్టు.. 5గురికి శిక్ష..ఇద్దరికి క్లీన్ చిట్
ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లిసీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. సుదీర్ఘ విచారణ అనంతరం 15ఏళ్ల తర్వాత ఈ కేసులో మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా...
మహేశ్వరం మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రోడ్డుకు అడ్డంగా ప్రహరీ నిర్మాణం.. నేలమట్టం చేసిన హైడ్రా
అల్కాపురి కాలనీలో సిలిండర్ బ్లాస్ట్.. 15 గుడిసెలు దగ్ధం
సంధ్య మినీ కన్వెన్షన్ హాల్ ని నేలమట్టం చేసిన హైడ్రా
ఫెడరల్ నిధులు నిలిపివేసిన ట్రంప్
వైద్య రంగంలో మిరాకిల్.. అక్కడ రోబోలే డాక్టర్లు..