నేడు హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్..

By Ravi
On
నేడు హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్..

ఐపీఎల్ 2025 సీజన్ క్రమంగా ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. ఈ సీజన్‌లో 51వ మ్యాచ్‌ నేడు గుజరాత్, హైదరాబాద్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరుగుతుంది. ఇప్పటివరకు, టోర్నమెంట్‌లో గుజరాత్ టీమ్ ప్రజంటేషన్ బాగుంది. ఆడిన 9 మ్యాచ్‌ల్లో గుజరాత్ 6 గెలిచి 3 ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో గుజరాత్ 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు గత సీజన్ ఫైనలిస్ట్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుత సీజన్‌లో పేలవమైన స్థితిలో ఉంది. హైదరాబాద్ 9 మ్యాచ్‌ల్లో 3 గెలిచి 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 

దీంతో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. అయితే గుజరాత్, హైదరాబాద్ మధ్య ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచ్‌లలో 4-1 ఆధిక్యంలో ఉంది. అహ్మదాబాద్‌లో రెండు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌లలో GT గెలిచింది. పాయింట్ల లిస్ట్ గురించి చూస్తే.. గుజరాత్ తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి టాప్-4లో ఉంది, అదే సమయంలో ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన హైదరాబాద్ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది.

Advertisement

Latest News

మంత్రాల చెరువు సందర్శించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మంత్రాల చెరువు సందర్శించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువును ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. చెరువు చుట్టూ సుమారు రెండున్నర కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి అక్కడి...
పోలీసులను మిత్రులుగా భావించే స్థాయిలో పని చేయాలి. డీజీపీ జితేందర్
హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గొల్లురులో ఉచిత వైద్య శిబిరం
దంపతుల ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి, భర్త పరిస్థితి విషమం..!
కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలం స్వాధీనం.. పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌..!
అక్రమంగా వెలిసిన ఇళ్లపై రెవెన్యూ అధికారుల దాడులు..!
పవన్‌పై మోదీ కన్సర్న్‌ వెనుక పెద్ద ప్లాన్‌..!