మూడుచింతలపల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం 

By Ravi
On
మూడుచింతలపల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం 

మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం  అయ్యింది. ధాన్యం కొలుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మల్కాజ్ గిరి ఎంపి ఈటల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిలు సూచించారు. రైతాంగం పండించిన ప్రతి గింజను సొసైటీలోనే అమ్మాలని రైతులకు ఎంపి ఈటల రాజేందర్ సూచించారు. రైతులు దలారులను నమ్మి మోసపోకుండా సొసైటీ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి దాన్యాన్ని అమ్మాలన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనసాలనే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి కొనుగోలు కేంద్రంను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నర్సింహులు యాదవ్, డిసిఎంఎస్ వైస్ ఛైర్మన్, శామీర్ పేట్ సొసైటీ ఛైర్మన్  మధుకర్ రెడ్డి, శామీర్ పేట్ సొసైటీ వైస్ ఛైర్మన్ ఐలయ్య యాదవ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

తెలంగాణలో గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు మధ్యంతర స్టే పొడిగింపు తెలంగాణలో గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు మధ్యంతర స్టే పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 నియామక ప్రక్రియపై నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నియామకాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఏప్రిల్ 17న హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం...
పాఠశాల గదుల నిర్మాణాలకు అడ్డువస్తే సహించేది లేదు. ఆకుల సతీష్
మిస్ వరల్డ్ పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. డీజీపీ జితేందర్
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్
ట్రంప్‌ చర్చలపై చైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
పాకిస్తాన్‌ పై ఆర్థిక దాడులకు ప్లాన్ చేస్తున్న భారత్..
వేలాది మదర్సాలను మూసేస్తున్న పాకిస్తాన్..