ఎక్స్‌ ప్రెస్‌ వేపై యుద్ధవిమానాల ల్యాండింగ్‌.. 

By Ravi
On
ఎక్స్‌ ప్రెస్‌ వేపై యుద్ధవిమానాల ల్యాండింగ్‌.. 

వాయుసేన యుద్ధవిమానాలు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఎక్స్‌ ప్రెస్‌ వేపై టేకాఫ్‌, ల్యాండింగ్‌ ను ప్రాక్టీస్ చేస్తున్నాయి. నేడు ఉత్తర్‌ప్రదేశ్‌ లోని షాజహాన్‌ పుర్‌ లోని గంగా ఎక్స్‌ ప్రెస్‌ వేపై ఉన్న దాదాపు 3.5 కిలోమీటర్ల ఎయిర్‌ స్ట్రిప్‌పై ఈ సాధన జరుగుతోంది. దీనిని యుద్ధవిమానాలు ల్యాండింగ్‌కు అనుకూలంగా నిర్మించారు. ఎక్స్‌ప్రెస్‌ రహదారి రన్‌వేకు ప్రత్యామ్నాయంగా ఎంత మేరకు ఉపయోగపడుతుందనే అంశాలను ఈ సందర్భంగా పరిశీలిస్తున్నారు. ఇవి రెండు భాగాలుగా జరగనున్నాయి. ఉదయం, రాత్రి ల్యాండింగ్‌, టేకాఫ్‌ చేయనున్నారు. ఉదయం సాధారణ వేళల్లోనే ఈ పరీక్షలు జరుగుతున్నాయి. కానీ, రాత్రి మాత్రం 7 గంటల నుంచి 10 గంటల మధ్యలో వీటిని నిర్వహించనున్నారు. 

ఓ పక్క భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ ఈ పరీక్షలు జరగడం గమనార్హం. యుద్ధ విమానాల రాక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి జాగ్రత్తలు తీసుకొంది. దాదాపు 250 సీసీ కెమెరాలను ఇక్కడ ఇన్‌స్టాల్‌ చేసింది. నిన్నటి నుంచే ఈ మార్గం పూర్తిగా వాయుసేన నియంత్రణలోకి వెళ్లిపోయింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో యుద్ధ విమానాలు దిగేలా నిర్మించిన నాలుగో ఎక్స్‌ ప్రెస్‌ వే ఇది. గతంలో ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌వే, పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వే, బూందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ సౌకర్యాలున్నాయని అధికారులు తెలిపారు.

Advertisement

Latest News

తెలంగాణలో గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు మధ్యంతర స్టే పొడిగింపు తెలంగాణలో గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు మధ్యంతర స్టే పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 నియామక ప్రక్రియపై నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నియామకాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఏప్రిల్ 17న హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం...
పాఠశాల గదుల నిర్మాణాలకు అడ్డువస్తే సహించేది లేదు. ఆకుల సతీష్
మిస్ వరల్డ్ పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. డీజీపీ జితేందర్
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్
ట్రంప్‌ చర్చలపై చైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
పాకిస్తాన్‌ పై ఆర్థిక దాడులకు ప్లాన్ చేస్తున్న భారత్..
వేలాది మదర్సాలను మూసేస్తున్న పాకిస్తాన్..