ఐపీఎల్కు మ్యాక్స్వెల్ దూరం?
పంజాబ్ కింగ్స్కు ఓ బ్యాడ్ న్యూస్. ఆస్ట్రేలియన్ ఆల్ రౌండరైన గ్లెన్ మ్యాక్స్వెల్ ఐపీఎల్కు దూరం కానున్నాడు. చేతి వేలు విరిగినందున అతడు ఐపీఎల్ లో మిగతా మ్యాచ్ లు ఆడలేరు. కోల్కతా టీమ్ తో జరిగిన మ్యాచ్ లో వర్షం పడటానికి ముందే మాక్స్ వెల్ గాయంతో సఫర్ అయ్యారు. అయితే ఆ మ్యాచ్లో అతడు కేవలం 7 పరుగులకే ఔటయ్యాడు. ఈ సీజన్లో మ్యాక్స్వెల్ పెద్దగా ఫామ్లో కూడా లేడు. రీసెంట్ గా జరిగిన లేటెస్ట్ మ్యాచ్ లో అతడి స్థానంలో సూర్యాన్ష్ షెడ్జ్ వచ్చాడు.
కాగా ఈ మ్యాచ్ లో పంజాబ్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. దురదృష్టవశాత్తూ, మాక్స్వెల్ వేలు విరిగింది. శిక్షణలో చివరి ఆటకు ముందు అతడు గాయపడ్డాడు. ముందు అది చిన్న గాయమే అనుకున్నాం. తర్వాత అది పెద్ద సమస్యే అని తేలింది. స్కానింగ్లో వేలు విరిగినట్లు తేలింది. దీంతో అతడు టోర్నమెంట్కు దూరమయ్యే అవకాశముందని నేను భావిస్తున్నాను అని మార్కస్ స్టాయినిస్ అన్నాడు. మ్యాక్స్వెల్ స్థానాన్ని భర్తీ చేసేందుకు సరైన సెలెక్షన్ కోసం చూస్తున్నామని పంజాబ్ టీమ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కామెంట్ చేశారు.