ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025లో అగ్రస్థానంలో తెలంగాణ పోలీసులు
By Ravi
On
ఇండియా జస్టిస్ రిపోర్ట్ - 2025 ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో మొదటి స్థానం నిలిపినందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ మరియు ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ బి. శివధర్ రెడ్డిలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలను పకడ్బందీగా కాపాడేందుకు రాష్ట్ర పోలీసులు ప్రదర్శించిన అంకితభావం మరియు వ్యూహాత్మక నాయకత్వానికి ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మరియు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరియు ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఎ. శాంతి కుమారి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పోలీసు అధికారులకు అభినందనలు తెలిపారు.
Tags:
Latest News
07 May 2025 19:51:55
నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదంలో కొరియోగ్రాఫర్ మృతి చెందాడు. మణికొండ శ్రీరామ్ నగర్ కాలనీ కుతుబ్ ఆర్కేట్ లో కొరియోగ్రాఫర్ వీరేందర్ రెడ్డి 4వ అంతస్థులో...