ఆకతాయిల ఆగడాలు అరికట్టేందుకు షీ టీమ్స్ మరో ముందడుగు.

By Ravi
On
ఆకతాయిల ఆగడాలు అరికట్టేందుకు  షీ టీమ్స్ మరో ముందడుగు.

షీ టీమ్స్ సిబ్బందికి ఎలక్ట్రానిక్ పరికరాలు ( లాప్టాప్స్, పెన్ కెమెరాలు, ప్రొజెక్టర్స్, ప్రింటర్స్, సెల్ ఫోన్స్) పంపిణీ చేసిన కమిషనర్.

ఆకతాయిల వేదింపులను నియంత్రించడానికి, ప్రజలలో అవగాహన కల్పించడానికి నూతన టెక్నాలజీతో షీ టీమ్స్ మరో ముందడుగు: సీపీ సుధీర్ బాబు ఐపీఎస్.

ఈరోజు రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ మహిళా రక్షణ కొరకు షీ టీమ్స్ నూతన సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మరింత వేగవంతంగా పనిచేయడానికి ఉపయోగపడేలా మరియు ఆకతాయిల వేధింపులను నియంత్రించడం కోసం ప్రజల్లో అవగహన కల్పించడానికి ఈ రోజు రాచకొండ కమిషనరేట్ నేరేడ్మెట్ నందు షీ టీమ్స్ సిబ్బందికి లాప్టాప్స్, పెన్ కెమెరాలు, ప్రొజెక్టర్స్, ప్రింటర్స్, సెల్ ఫోన్స్ వంటి సాంకేతిక పరికరాలు పంపిణీ చేయడం జరిగింది. మహిళా భధ్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఈ నూతన సాంకేతిక పరికరాలతో మరింత సమర్థవంతంగా పని చేయాలని ఈ సందర్భంగా కమిషనర్ గారు సూచించారు. 

ఈ కార్యక్రమంలో డిసిపి ఉమెన్స్ సేఫ్టీవింగ్ ఉషా విశ్వనాథ్, ఇన్స్పెక్టర్ ముని , ఇన్స్పెక్టర్ అంజయ్య , అడ్మిన్ ఎస్ ఐ రాజు మరియు షీ టీమ్స్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!