కులగనన సర్వే చేసిన వారికి డబ్బులు చెల్లించండి.

రంగా రెడ్డి జిల్లా:-
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సరూర్ నగర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన కులగనన సర్వే నిర్వహించిన ఎనిమి లెటర్లు,రిసోర్స్ పర్సన్స్.
కుల గణన సర్వే చేసి ఆరు నెలలు కావస్తున్న ఇంత వరకు ప్రభుత్వం ఇస్తానన్న డబ్బులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులను అడుగుతే రేపు, మాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాలేజ్ స్టూడెంట్,గృహినిలు, పొదుపు సంఘాల మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారని వారికి ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లిస్తానన్న 10000 రూపాయలు ఇవ్వలేదని 10% మందికి మాత్రమే డబ్బులు చెల్లించి చేతులు దులుపుకున్నారని ఇంకా 90% మందికి అకౌంట్ లో జమ కాలేదని తెలిపారు.
ప్రభుత్వం అవసరానికి మాతో పని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులను విడుదల చేయాలని కోరారు.
Latest News
