మండల ప్రజా పరిషత్ బడ్జెట్ సమావేశం
By Ravi
On
NV SURYA TUNI TPN APR (3)
కాకినాడ జిల్లా తుని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది సమావేశానికి హాజరైన సర్పంచులు అధికారులను ప్రశ్నించారు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం అందరికీ చేరటం లేదని నిలదీశారు దీనిపై అధికారులు స్పందిస్తూ భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు గ్రామస్థాయిలో ఏర్పడిన నీటి కొరతపై అధికారులు స్పందించారు మోటర్లతో నీటిని తోడవడం వల్ల నీటి కొరత ఏర్పడుతుందని తెలిపారు పోలీసుల భాగస్వామ్యంతో మోటర్లను తొలగించేందుకు చర్యలు చేపట్టాలన్నారు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు బొప్పన రాము ఉపాధ్యక్షులు చిటికెల సత్యవతి చోడిశెట్టి సత్య నాగేశ్వరరావు జడ్పిటిసి సభ్యురాలు పోతల సూర్యమణి ఆర్ డబ్ల్యూ ఎస్ ఏ ఈ ఈ శివాజీ తహసిల్దార్ ప్రసాద్ గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు సమావేశంలో పాల్గొన్నారు
Tags:
Latest News
16 Apr 2025 21:22:40
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...