నాణ్యతలేని కోటా బియ్యం - పట్టణ ప్రజల ఆరోపణ

By Ravi
On
 నాణ్యతలేని కోటా బియ్యం - పట్టణ ప్రజల ఆరోపణ

MAHESH, MANDAPETA, TPN

మండపేట లో ఈ నెల సరఫరా చేసిన పి డీ ఎఫ్ బియ్యం నాసిరకం గా వుందని ప్రజలు ఆరోపించారు. మండపేట 11 వ వార్డు లో ఏప్రియల్ నెల లో సరఫరా చేసిన కోటా బియ్యం కడిగితేనే నూక మాదిరి తయారు అవుతుందని అక్కడి స్థానికులు ఆరోపించారు. ఆ వార్డు కు చెందిన చుండ్రు సత్యనారాయణ ఆ బియ్యాన్ని కడిగి మీడియా కు చూపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాణ్యమైన బియ్యం ఇచ్చేవారని స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ సారి కొత్త బియ్యం సరఫరా చేశారని నాణ్యత లేని బియ్యం పేదలకు సరఫరా చేశారని మండి పడుతున్నారు. బియ్యం సరఫరా వాహనం వద్దే  అమ్ముకునే వారికి డబ్బులు వచ్చేస్తున్నాయని, పేదలు మధ్యతరగతి ప్రజలకు ఇదే అన్నం అని అవేదన వ్యక్తం చేశారు. బియ్యం నీటి లో కడిగిన వెంటనే నూక మాదిరి గా అవుతుంది. బియ్యం ముద్దగా ఉడుకుతుంది. దీంతో తినే అవకాశం లేకుండా పోతుందని చెబుతున్నారు. నాణ్యత పరిశించాల్సిన అధికారులు తీరు ను ప్రశ్నిస్తున్నారు. పేదల బియన్ని యదేచ్చగా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న పట్టించుకోవడం లేదని విమర్శలు వున్నాయి. దీనిపై పౌర సరఫరాల అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. వచ్చే నెల లో అయినా నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు.

Tags:

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..