దేశంలో మొట్టమొదటిసారిగా చందువా చేప పిల్లల హేచెరీ
సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తో శ్రీ వైభవ్ హేచరిస్ ఎం ఓ యు
కాకినాడ జిల్లా తొండంగి మండలం దానవాయి పేటలో చందువా చేపల సాగుపై అవగాహన సదస్సు జరిగింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ( సీఎం ఎఫ్ ఆర్ ఐ ) ఆధ్వర్యంలో ఆక్వా రైతులకు ఈ సదస్సు నిర్వహించారు శ్రీ వైభవ్ హేచరీ ఎండి బేటే చంద్రశేఖర్ తో కుదుర్చుకున్న ఎం ఓ యు ను ప్రదర్శించారు సీఎం ఎఫ్ ఆర్ ఐ ప్రిన్సిపల్ సైంటిస్ట్ జోకే కిజహకుడన్ మాట్లాడుతూ సుమారు 17 సంవత్సరాల పాటు పరిశోధనలు జరిపి చందువ సీడ్ (చేప పిల్లలు) ప్రత్యుత్పత్తి చేయడం జరిగిందని తెలిపారు మూడు నెలల సాగులో 750 గ్రాముల వరకు చేపల పెరుగుదల ఉంటుందన్నారు. నిరోధక శక్తి కలిగి ఉండడమే కాకుండా భారత దేశపు వాతావరణానికి అనుకూలంగా చేపల పెరుగుదల ఉంటుందన్నారు చందువా చేపకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని తెలిపారు. సీనియర్ సైంటిస్ట్ బి జి జేవియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ జయశ్రీలోక డాక్టర్ రితీష్ రంజన్ డాక్టర్ శేఖర్ మహర్జన్ చంద్రశేఖర్ కుమారుడు కపిల్ విఖ్యాత్ అధిక సంఖ్యలో ఆక్వారైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.