117 జీవో రద్దు – విద్యా విధానంలో 4 విధాలుగా మార్పులు: ఎమ్మెల్యే గొండు శంకర్
శ్రీకాకుళం: విద్యా వ్యవస్థ బలోపేతం కోసం, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 117 జీవోను కూటమి ప్రభుత్వం రద్దు చేసినట్లు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన గార మండలంలోని ఎండిఓ ఆఫీస్ లో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ, "117 జీవో రద్దు చేసి, ప్రస్తుత ప్రభుత్వం విద్యా విధానాన్ని బలోపేతం చేయడానికి నాలుగు విధాలుగా అమలు చేయనున్నది" అని చెప్పారు. ఆయన వివరించగా, విద్యా విధానం నాలుగు భాగాలలో అమలు చేయబడుతుంది:
-
ఫౌండేషన్ కోర్సు
-
బేసిక్ ప్రైమరీ
-
మోడల్ ప్రైమరీ
-
హై స్కూల్ విద్యా విధానం
ఈ విధానాలను అమలు చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని ఆయన తెలిపారు. పాఠశాలల్లో విద్యాబోధనలో మార్పు, విద్యా విధానంలో అంచనాలను బట్టి మంచి విజయం సాధించవచ్చని అన్నారు.
"గతంలో 117 జీవో ద్వారా విద్యా విధానంలో జరిగిన నష్టాలను దృష్టిలో పెట్టుకొని, ఈ జీవోను రద్దు చేసేందుకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది" అని ఎమ్మెల్యే గోవిందరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారి, విద్యా కమిటీ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.