పంత్, శ్రేయస్‌ విషయంలో అదంతా నిజం కాదు: ప్రీతీ జింతా

By Ravi
On
పంత్, శ్రేయస్‌ విషయంలో అదంతా నిజం కాదు: ప్రీతీ జింతా

ఐపీఎల్ 2025 సీజన్‌ కు ముందు మెగా వేలం జరిగిన సంగతి తెలిసిందే. లక్నో టీమ్ రూ.27 కోట్లను వెచ్చించి రిషభ్‌ పంత్‌ ను తీసుకుంది. పంజాబ్ కింగ్స్‌ రూ.26.75 కోట్లతో శ్రేయస్‌ ను సొంతం చేసుకుంది. వీరిద్దరి కోసం తీవ్రస్థాయిలోనే పోటీ జరిగింది. పంత్‌ ను తీసుకుందామని రికీ పాంటింగ్‌ కూడా భావించినట్లు తెలిసింది. వీరిద్దరూ కలిసి ఢిల్లీ క్యాపిటల్స్‌ లో పనిచేశారు. అయితే, మేనేజ్‌మెంట్‌ మాత్రం శ్రేయస్‌ అయ్యర్‌ వైపు ఫోకస్ చేసింది. ఈక్రమంలో పంత్, శ్రేయస్‌ గురించి తానేదో కామెంట్స్ చేసినట్లు వస్తున్న వార్తలను ప్రీతీజింతా కొట్టిపడేసింది. అవన్నీ తప్పుడివేనని సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. 

అయితే ఒక ఇంటర్వ్యూలో పంత్ మాట్లాడుతూ నేను ఎప్పుడూ పంజాబ్ టీమ్ కు ప్రాతినిధ్యం వహించను అని అన్నట్లుగా.. దానికి ప్రీతీ జింతా స్పందిస్తూ మెగా వేలం సమయంలో రిషభ్‌ పంత్, శ్రేయస్‌ అయ్యర్‌ను పరిశీలించాం. జట్టులోకి ఎవరిని తీసుకోవాలనే దానిపై ఆప్షన్లు పెట్టుకున్నాం. కానీ, మాకు గొప్ప ప్రదర్శన చేసే ఆటగాడు కావాలి. అంతేకానీ, గొప్ప పేరున్నవారు కాదు. అందుకే, రిషభ్‌ను కాదని శ్రేయస్‌ను తీసుకున్నాం అని కామెంట్స్ చేశారు.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!