ముంబై టీమ్ మ్యాచ్‌ లో అనంత్, రాధిక.. 

By Ravi
On
ముంబై టీమ్ మ్యాచ్‌ లో అనంత్, రాధిక.. 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, చిన్న కోడలు రాధికా మర్చంట్‌ మరోసారి వైరల్ గా మారారు. ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ లో వీరిద్దరూ స్టేడియంలో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ముంబై ఇండియన్స్‌ టీమ్ కు నీతా అంబానీ ఓనర్ అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో అంబానీ ఫ్యామిలీ కచ్చితంగా హాజరవుతూ ఉంటుంది. తాజాగా అనంత్‌, రాధిక జంట ముంబై టీమ్‌ కు మద్దతు తెలిపేందుకు మ్యాచ్‌కు హాజరైంది. ఆ సమయంలో ఈ జంట గ్యాలరీలో పక్కపక్కన కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. 

వారిద్దరికి సంబంధించిన క్యూట్‌ అండ్‌ రొమాంటిక్‌ మూమెంట్స్‌ను కొందరు తమ కెమెరాల్లో షూట్ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. కాగా, చిన్నతనం నుంచే స్నేహితులైన అనంత్‌, రాధిక గతేడాది జులైలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం దాదాపు ఆరు నెలలు జరిగిందనే చెప్పాలి. ప్రీ వెడ్డింగ్‌, పార్టీలు, పూజలు అంటూ ఏడాదంటా వీరి వెడ్డింగ్‌ గురించే ప్రపంచం అంతా మాట్లాడుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!