"అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తాం - ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి"

By Ravi
On

WhatsApp Image 2025-03-26 at 6.32.00 PMపోలాకి, మార్చి 26:

ప్రతి అర్హుడికి ఇల్లు మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి  తెలిపారు. ఈ రోజు కత్తిరివానిపేట క్యాంపు కార్యాలయంలో గృహనిర్మాణ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన, నియోజకవర్గంలో కొనసాగుతున్న గృహనిర్మాణ పనులపై వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా, ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, "గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, అందులో ఏమైనా సమస్యలు వస్తే, వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని" అన్నారు.

ఆయన మాట్లాడుతూ, "అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కా గృహం మంజూరు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. పీఎంఏవై అర్బన్, పీఎంఏవై గ్రామీణ పథకాల కింద బిసి, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 50000, 75000, మరియు లక్ష రూపాయల అదనపు సాయం అందించడం, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు" అని అన్నారు.

ఆయన ఇంకా, "డిమాండ్ సర్వే ఈ నెల చివరితో ముగియనుంది. అర్హులైన లబ్ధిదారులు త్వరగా ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు."

ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ డీఈ, నాలుగు మండలాల ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News