ఈడీ కార్యాలయం ఎదుట టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా..!

By Ravi
On
ఈడీ కార్యాలయం ఎదుట టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా..!

హైదరాబాద్ TPN : నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ పేర్లను ఛార్జ్‌షీట్‌లో చేర్చడాన్ని నిరసిస్తూ ఈడీ కార్యాలయం ఎదుట టీపీసీసీ నేతలు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బీజేపీ ఫాసిస్టు పాలన కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఇమేజ్ ఓర్వలేక మోదీ సర్కార్ అక్రమ కేసుల కుట్రలకు తెరలేపిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు నిజాలు తెలియాలనే ఈ ధర్నా చేపట్టినట్లు తెలిపారు. నేషనల్ హెరాల్డ్ పేపర్‌కి రూ.90 కోట్లు రుణం ఇస్తే మనిలాండరింగ్ జరిగినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. గాంధీ కుటుంబం ఏనాడూ కేసులకు భయపడింది లేదన్నారు. మోడీకి కనువిప్పు కలిగేలా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. 
రాహుల్‌గాంధీ సంకల్పం ముందు ఈ కుట్రలు, అక్రమ కేసులు బలాదూర్ అన్నారు. కులగణనతో రాహుల్‌గాంధీ మోదీకి రాజకీయంగా మరణ శాసనం రాశారన్నారు. బీహార్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే రాహుల్‌గాంధీ, సోనియాగాంధీపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలు రాగానే ప్రతిపక్షాలపై ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను వాడడం మోదీ-అమిత్ షాకి అలవాటుగా మారిందన్నారు.   గుజరాత్‌లో ఏఐసీసీ సమావేశాలతో బీజేపీ నేతల్లో వణుకు మొదలైందని చెప్పారు.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!