మీర్పేట్ కార్పొరేషన్ ను జిహెచ్ఎంసిలో విలీనం:50% ప్రపార్టీ ట్యాక్స్ తగ్గింపు

By Ravi
On
మీర్పేట్ కార్పొరేషన్ ను జిహెచ్ఎంసిలో విలీనం:50% ప్రపార్టీ ట్యాక్స్ తగ్గింపు

హైదరాబాద్, 25 మార్చి 2025:
టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు సామీడి గోపాల్ రెడ్డి మరియు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ కేఎల్ఆర్ ఈరోజు మీర్పేట్ కార్పొరేషన్ ను జిహెచ్ఎంసి (హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్) లో విలీనం చేయడం, మరియు 50% వరకు ప్రాపర్టీ టాక్స్ తగ్గించడానికి తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించారు.

ఈ నిర్ణయాన్ని మహేశ్వరం నియోజకవర్గంలోని కేఎల్ఆర్ క్యాంప్ ఆఫీస్ లో వారు ప్రెస్ మీట్ ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల పై భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని, రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు సహాయంతో ఈ నిర్ణయం అమలు చేస్తున్నారని తెలిపారు.

సామీడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, "డబ్బున్నవారిపై టాక్స్ పెంచడం అనేది ఆమోదయోగ్యమే, కానీ రెక్కాడితేగా నొక్కాడని పరిస్థితుల్లో జీవిస్తున్నవారికి పెద్ద భారం పడకుండా వారి పక్షంలో నిలబడాలని మా ప్రభుత్వ లక్ష్యం."

ఈ చర్యతో ప్రాపర్టీ టాక్స్ లో మార్పులు తీసుకుని, బలహీన వర్గాల మన్నించడానికి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వారు చెప్పారు.

Tags:

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..