మీర్పేట్ కార్పొరేషన్ ను జిహెచ్ఎంసిలో విలీనం:50% ప్రపార్టీ ట్యాక్స్ తగ్గింపు

By Ravi
On
మీర్పేట్ కార్పొరేషన్ ను జిహెచ్ఎంసిలో విలీనం:50% ప్రపార్టీ ట్యాక్స్ తగ్గింపు

హైదరాబాద్, 25 మార్చి 2025:
టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు సామీడి గోపాల్ రెడ్డి మరియు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ కేఎల్ఆర్ ఈరోజు మీర్పేట్ కార్పొరేషన్ ను జిహెచ్ఎంసి (హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్) లో విలీనం చేయడం, మరియు 50% వరకు ప్రాపర్టీ టాక్స్ తగ్గించడానికి తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించారు.

ఈ నిర్ణయాన్ని మహేశ్వరం నియోజకవర్గంలోని కేఎల్ఆర్ క్యాంప్ ఆఫీస్ లో వారు ప్రెస్ మీట్ ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల పై భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని, రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు సహాయంతో ఈ నిర్ణయం అమలు చేస్తున్నారని తెలిపారు.

సామీడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, "డబ్బున్నవారిపై టాక్స్ పెంచడం అనేది ఆమోదయోగ్యమే, కానీ రెక్కాడితేగా నొక్కాడని పరిస్థితుల్లో జీవిస్తున్నవారికి పెద్ద భారం పడకుండా వారి పక్షంలో నిలబడాలని మా ప్రభుత్వ లక్ష్యం."

ఈ చర్యతో ప్రాపర్టీ టాక్స్ లో మార్పులు తీసుకుని, బలహీన వర్గాల మన్నించడానికి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వారు చెప్పారు.

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!