కేటీర్ కు కొప్పుల ఈశ్వర్ సపోర్ట్ - కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు

On
కేటీర్ కు కొప్పుల ఈశ్వర్ సపోర్ట్ - కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు

హైదరాబాద్, జూన్ 13:
ఫార్ములా-ఈ కారు రేసుకు సంబంధించి నమోదైన కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఈ నెల 16వ తేదీన విచారణకు హాజరుకావాలని ఏసీబీ అధికారులు ఇచ్చిన నోటీసులను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా ఖండించారు.

ఈ కేసులో మరోసారి నోటీసులు జారీ చేయడం కాంగ్రెస్‌ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన వైఫల్యాలను ప్రజల దృష్టికి రానివ్వకుండా మళ్లించేందుకు కేటీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేస్తోందని విమర్శించారు.

"రేవంత్ రెడ్డి.. నువ్వు ఎన్ని రకాల కేసులు పెట్టినా భయపడేది లేదు. బీఆర్ఎస్ ఉద్యమం నుండి పుట్టిన పార్టీ. ప్రజల కోసం నిలబడే పార్టీ. రానున్న రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి, మీ వైఫల్యాలపై నిరంతరం పోరాడుతుంది," అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు.