గచ్చిబౌలిలో పబ్‌లపై ఎస్ఓటీ పోలీసుల దాడులు – డ్రగ్స్ టెస్ట్‌లో డీజే సహా నలుగురికి పాజిటివ్

On
గచ్చిబౌలిలో పబ్‌లపై ఎస్ఓటీ పోలీసుల దాడులు – డ్రగ్స్ టెస్ట్‌లో డీజే సహా నలుగురికి పాజిటివ్

హైదరాబాద్, జూన్ 14:
హైదరాబాద్‌ నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న పలు పబ్‌లపై మాదాపూర్ ఎస్ఓటీ (స్పెషల్ ఆపరేషన్ టీమ్) పోలీసులు శుక్రవారం అర్థరాత్రి ప్రత్యేక దాడులు నిర్వహించారు.

ఎస్‌ఎల్‌ఎన్ టెర్మినస్‌లో ఉన్న క్లబ్ రోగ్ మరియు ఫ్రాట్ హౌస్ పబ్‌లలో సందడి చేస్తున్న యువతపై అధికారులు డ్రగ్స్ టెస్టులు చేపట్టారు. పరీక్షల్లో నలుగురు వ్యక్తులు గంజాయి సేవించినట్లు స్పష్టమైంది.

పాజిటివ్ వచ్చినవారిలో ఒకరు డీజే ప్లేయర్ శివ ఉండడం గమనార్హం. పోలీసులు ఈ ఘటనపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

డ్రగ్స్ కట్టడి కోసం అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నామని సమాచారం. ఈ తరహా దాడులు నిరంతరాయంగా కొనసాగనున్నాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి.