మాజీ ఆర్మీ ఉద్యోగులు.. అడ్డదారిలో డిఫెన్స్ మద్యం విక్రయాలు

On
మాజీ ఆర్మీ ఉద్యోగులు.. అడ్డదారిలో డిఫెన్స్ మద్యం విక్రయాలు

మాజీఆర్మీకి చెందిన ఇద్దరు వ్యక్తులు రెండు చోట్ల మద్యం అమ్మకాలు జరుపుతున్నారు అనే సమాచారం మేరకు మల్కాజిగిరి ఏఈఎస్ ముకుందరెడ్డి బృందం రెండు చోట్ల దాడి చేసి 37 డిఫెన్స్ మద్యం బాటిళ్లను  సీజ్ చేశారు. పట్టుబడిన టిఫిన్స్ మద్యం బాటిళ్లు కర్నాటక చెందినవిగా గుర్తించారు. డిఫెన్స్ క్యాంటీన్లో నెలవారీగా వచ్చే కోటాను కొంతమంది వద్ద బాటిళ్లను  కొనుగోలు చేసి మాజీసర్వీస్ మెన్ పురుషోత్తం యాప్రాల్ లో, ముప్పరపు సిద్దయ్య అనే ఆర్మీ పర్సనల్ కౌకూర్ లో అమ్మకాలు జరుపుతుండగా పట్టుకున్నట్లు ఏఎస్బి ముకుంద రెడ్డి తెలిపారు. పట్టుకున్న మద్యం విలువ రూ. 75 వేలు ఉంటుందని అంచనా వేశారు.
మద్యం పట్టుకున్న వారిలో ఏఈఎస్ ముకుంద రెడ్డితో పాటు సీఐ భరత్ భూషణ్ డిటిఎఫ్ ఎక్సైజ్ ఎస్సై శ్రీనివాస్ రెడ్డిలు  సిబ్బంది ఉన్నారు. మద్యం బాటిల్స్ పట్టుకున్న సిబ్బందిని ఎక్సైజ్  సూపరిండెంట్ నవీన్ అభినందించారు.
 మేడ్చల్ లో...
 మేడ్చల్ ఈఎస్ పరిధిలో హర్యానాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లేబర్ వారు తీసుకు వచ్చే మద్యం బాటిళ్లను మేడ్చల్ సిఐ నవనీత ఏఈ ఎస్ మాధవయ్య డిటిఎఫ్ నర్సిరెడ్డిలు సిబ్బంది కలిసి వాహనాలు, బస్సుల్లో తనిఖీలు చేసి 24 మద్యం బాటిలను సీజ్ చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్ల విలువ రూ. 48 వేలు ఉంటుందని అంచనా వేశారు.