నాగబాబుకు మంత్రి పదవి ఉందా లేదా? క్లారిటీ ప్లీజ్

On
నాగబాబుకు మంత్రి పదవి ఉందా లేదా? క్లారిటీ ప్లీజ్

అయినవాడికి అరిటాకులో.. కానివాడికి కంచంలో అనేది పాత సామెతడి. ఇప్పుడు అయినవాడికి ఆఖర్లో అని దానిని మార్చుకోవాలేమో.  మెగా సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇప్పటికి ఆరు నెలల దాటుతోంది. ఇప్పటివరకు ఎప్పుడో కూడా చెప్పటం లేదు. ముందు అసలు రాజ్యసభ ఎంపీ అన్నారు.. సానా సతీష్ రంగంలోకి దిగటంతో అధి ఆపేసి.. ఆ రోజే నాగబాబుకి మంత్రి పదవి అని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. సానా సతీష్ లోకేష్ కి క్లోజ్ కావటంతో ఈ వ్యవహారం జరిగిందని టాక్. కాకినాడ సీటు అసలైతే సానా సతీష్ కి ఇవ్వాలని.. కాని పవన్ కల్యాణ్ పోటీ చేస్తారని ఆపేశారని అంటున్నారు. ఆ తర్వాత పవన్ పిఠాపురంకు మారడం.. అక్కడ ఇన్ ఛార్జిగా ఉన్న ఉదయ్ ను కాకినాడ పంపటం జరిగాయి. అప్పుడు సానా సతీష్ కు నష్టం జరిగింది కాబట్టి.. ఇప్పుడు న్యాయం చేయాలని పట్టుబట్టి రాజ్యసభ సీటు లోకేష్ ఇప్పించారనే ప్రచారం ఉంది. అందుకు బదులుగా పవన్ కల్యాణ్ పట్టుబట్టి మంత్రి పదవి హామీ తీసుకోవడమే కాక.. చంద్రబాబుతో ప్రకటన ఇప్పించారని చెప్పుకుంటున్నారు. 
ఆ ప్రకటన వచ్చిన దగ్గరి నుంచే ఒక ప్రచారం మొదలైంది. ఈ ప్రచారం ఎవరు మొదలెట్టారో.. ఎవరు చేశారో వివరంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జనసేనకు ఇచ్చింది మూడు మంత్రి పదవులు అందులో ఒకటి పవన్, రెండోది దుర్గేష్.. మూడోది నాదెండ్ల మనోహర్. మనోహర్ కమ్మసామాజికవర్గం... కాని మిగతా ఇద్దరూ కాపు సామాజికవర్గమే. ఇప్పుడు నాగబాబును తీసుకుంటే ముగ్గురూ కాపులే అవుతారు కదా అనే వాదన ప్రచారంలో పెట్టారు. పవన్ కల్యాణ్ పార్టీ అధినేత ఆయనకు కూడా సామాజికవర్గం లెక్కేస్తారా.. మరి చంద్రబాబు, లోకేష్ లను కూడా కమ్మ సామాజికవర్గం కింద లెక్కలు వేస్తారా అని జనసైనికులు సోషల్ మీడియాలో ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కూడా ఈ ప్రచారానికి సమాధానమిచ్చారు. నాగబాబు పార్టీ కోసం కష్టపడ్డారు కాబట్టి ఇచ్చాం.. అలాగే దుర్గేష్ కూడా పార్టీ కోసం ఎప్పటి నుంచో ఉన్నారని ఇచ్చాం అంతే కాని వారిద్దరు కాపులు అని కాదు.. నాగబాబు నా సోదరుడు అని కాదు.. అంటూ వివరించారు. అయినా ఆ ప్రచారం ఆగలేదు.
ఆ తర్వాత పవన్ కల్యాణ్ నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికవుతారని.. ఆ తర్వాతే మంత్రివర్గంలో చేరతారని చెప్పారు. ఇక్కడ కూడా కొన్ని డ్రామాలు నడిచాయి. నాగబాబు ఎమ్మెల్సీ వద్దన్నారని.. మంత్రి పదవి కూడా వద్దన్నారని.. అందుకని ఎంపీగా పంపుతారంటూ ఓ ప్రముఖ పత్రిక, అది కూడా టీడీపీ అనుకూల పత్రిక మెయిన్ పేజీలో వార్త ప్రకటించింది. ఆ వార్తకు ఎలాంటి ఆధారం లేదు. జనరల్ గా అలాంటి ఊహాగానాలు ఆ పత్రిక వేయదు. అంతలా ప్రాతివత్యం పాడు చేసుకుని మరీ వార్త ఇచ్చారంటే వెనక ఎవరున్నారో అర్ధమవుతుందని జనసైనికులు కామెంట్లు చేశారు. అయితే వెంటనే మరుసటి రోజే జనసేన లెటర్ హెడ్ మీద నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్ధి అని ప్రకటించడమే కాక.. పార్టీ అధినేత బీఫారం కూడా ఇచ్చినట్లు ప్రకటించేశారు. ఆ తర్వాత నాగబాబు నామినేషన్ కూడా వేశారు. ఎమ్మెల్సీగా ఎన్నిక కూడా పూర్తయిపోయింది.
ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టి మూడు నెలలు దాటిపోయింది. ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణ అని గాని.. నాగబాబుకు మంత్రి పదవి ఊసు గాని లేదు. అసలు ఆ చర్చే జరగటం లేదు. అసలు నాగబాబుకు మంత్రి పదవి ఉందా లేదా అనే డౌట్లు వచ్చేశాయి. పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ వార్షికోత్సవ సభలో వర్మపై చేసిన కామెంట్స్ వల్ల నాగబాబు బ్యాడ్ అయిపోయారనే ప్రచారం మరోవైపు జరుగుతోంది. అలాంటిదేమీ లేదని జనసేన వర్గాలు ఖండించినా.. నాగబాబుపై బ్యాడ్ క్యాంపెయన్ ఓ వర్గం అదే పనిగా చేస్తుందని జనసేన వర్గాలు మండిపడుతున్నాయి. 
నాగబాబు ఎలాంటివారనేది పక్కన పెడితే.. ఓ ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించినదానిని అమలు చేయాలి కదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అసలు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు.. తెర వెనుక ఏం జరుగుతుందనేది గట్టిగా చర్చ నడుస్తోంది. నాగబాబుకు ఇస్తే దుర్గేష్ ను తప్పిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. అలా ఎలా జనసేనకు నాలుగు మంత్రి పదవులు కదా.. ఇన్ని త్యాగాలు చేస్తే ఇలా చేస్తారా.. ఇది కూటమి న్యాయమా పద్ధతా అనే కామెంట్స్ వస్తున్నాయి. ఏమైనా నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వకపోయినా.. దుర్గేష్ ను తప్పించి నాగబాబుకు ఇచ్చినా.. గట్టిగా నష్టం జరిగేది మొదటగా పవన్ కల్యాణ్ కే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇంత బతుకు బతికి ఇంటెనక ఏదో అయినట్లు ఉంటుందని.. ఘోరంగా పరువు పోతుందని అంటున్నారు. మరి నాగబాబు మంత్రి అయ్యేదెన్నడో .. జనసైనికులు ఎదురుచూపులు ఇంకెన్నాళ్లో అని జనసేన వర్గాలు నిట్టూరుస్తున్నాయి. అది జరగకపోతే చాలు.. ఆ ఒక్క వ్యవహారమే కూటమి చీలికకు నాంది పలుకుతుందనే కామెంట్లు కూడా వస్తున్నాయి.

Advertisement

Latest News

శ్రీహరికోట షార్‌లో అనుమానితుడు కలకలం శ్రీహరికోట షార్‌లో అనుమానితుడు కలకలం
శ్రీహరికోట, జూన్ 16:శాతిష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్‌), శ్రీహరికోటలో అనుమానాస్పద వ్యక్తి తిరుగుతున్నట్టు చెన్నై పోలీసులకు అందిన సమాచారం నేపథ్యంలో భద్రతా శాఖలు అప్రమత్తమయ్యాయి. చెన్నై...
డయల్ 112కి కాల్.. హైదరాబాద్ లో తప్పిన భారీ ముప్పు
మాజీ ఆర్మీ ఉద్యోగులు.. అడ్డదారిలో డిఫెన్స్ మద్యం విక్రయాలు
వండర్ లా వద్ద వ్యాపారస్థుల ఆందోళన.. పిఎస్ లో ఫిర్యాదు
నాగబాబుకు మంత్రి పదవి ఉందా లేదా? క్లారిటీ ప్లీజ్
రెండోసారి ముగిసింది.. మూడో ఎపిసోడ్ మిగిలే ఉంది..
వెటర్నరీ.. పెట్ క్లినిక్ లపై డిసిఏ దాడులు.. కేసులు నమోదు