ఈవిఎం ల స్ట్రాంగ్ రూంను పరిశీలించిన సిఈఓ సి.సుదర్శన్ రెడ్డి
By MAHESH ARN
On
హైదరాబాద్, జూన్ 11: చుడిబజార్ లోని ఈవిఎం ల స్ట్రాంగ్ రూంను బుధవారం తెలంగాణ రాష్ట్ర సిఈఓ సి.సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి కర్ణన్ తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ యొక్క సెక్యూరిటీ , సేఫ్టీ, స్టోరేజ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల సంఘం రూపొందించిన ప్రోటోకాల్ పాటించాలని ఆయన సూచించారు. స్ట్రాంగ్ రూమ్ గోడౌన్ పరిశీలన సందర్భంగా సిఈఓ రిజిస్టర్ లో సంతకం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జాతీయ స్థాయి గుర్తింపు పొందిన వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ తరుపున రాజేష్, బిజేపి పార్టీ తరుపున పవన్, టిడిపి తరుపున ప్రశాంత్, బి.ఎస్.పి పార్టీ తరుపున నాందేశ్, ఎన్నికల అదనపు కమిషనర్ అలివేలు మంగతయారు తదితరులు పాల్గొన్నారు.