వైద్యం కోసం వస్తే.. ప్రాణాలు పోయేలా చేశారు..
- ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో కలకలం
- 70మంది రోగులకు అస్వస్థత.. ఒకరు మృతి
- అధికారులపై మండిపడుతున్న కుటుంబ సభ్యులు
హైదరాబాద్: ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో తీవ్ర కలకలం రేగింది. ఫుడ్ పాయిజన్. అయ్యి మొత్తం 70 మందికి పైగా రోగులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దిశెట్టి ఆస్పత్రికి వచ్చి పరిశీలించారు. ఫుడ్ పాయిజన్ కారణంగా కరణ్ అనే మానసిక రోగి ప్రాణాలు కోల్పోయాడు. 70 మందిలో 68 మంది పరిస్థితి నిలకడగా ఉందని, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై ఆరా తీసిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ 68 మంది రోగులకు ప్రత్యేకంగా ఉస్మానియానికి వచ్చిన వైద్య బృందం ద్వారా చికిత్స అందిస్తున్నారు. మానసిక రోగులు అని వారికి నాసిరకం భోజనం అందిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్యం కోసం వస్తే ప్రాణాలు తీస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అసలే వసతులు సరిగా ఉండవు, ఆమె ఇలాంటి ఘటనలు జరగడం భయానికి గురిచేస్తోందని అన్నారు.