జనాలతో కిక్కిరిసిన రేషన్ షాపులు.. మొరాయిస్తున్న బయోమెట్రిక్ మిషన్లు..
By Ravi
On
నగరంలో ఎక్కడ చూసినా రేషన్ షాప్స్ జనంతో కిక్కిరిసిపోతున్నాయి. కిలోమీటర్ల మేర ప్రజలతో క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఇబ్బందులు పడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రేషన్ దుకాణాలలో మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని కార్డు దారులకు ఒకేసారి అందజేయడంతో రేషన్ దుకాణాల వద్ద ప్రజలు క్యూలు కట్టారు. మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడంతో రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ మిషన్లకు సర్వర్ స్తంభించి మొరా ఇస్తుండడంతో ఒక్కొక్క కార్డుదారునికి బియ్యం ఇవ్వడాని గంటల సమయం పడుతుందని ప్రజలు వాపోతున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పందించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరుతున్నారు.
Latest News
04 Jun 2025 21:54:12
హైదరాబాద్: కూకట్ పల్లి డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు ఇద్దరు ఏపీ పోలీసులను అరెస్ట్ చేశారు. తిరుపతిలో టాస్క్...