పార్కింగ్ చేసిన వాహనాలే వారి టార్గెట్..
By Ravi
On
మేడ్చల్ జిల్లా : జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు దొంగిలిస్తున్న(వేరు వేరు కేసుల్లో) ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 12 లక్షల విలువ గల 8 ద్విచక్ర వాహనాలు, ఒక కారు,ఒక (అశోక్ లైల్యాండ్) గూడ్స్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. నక్క శ్రీనివాస్(32) మహ్మద్ షోహెబ్(26) గత కొంత కాలంగా వాహనాల దొంగతనాలకు పాల్పడుతూ జైలు శిక్ష అనుభవించి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వీరిపై పలు పోలీస్ స్టేషన్ల పరిధుల్లో కేసులు ఉన్నట్లు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ డీసీపీ సత్య నారాయణ వివరాలు వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో బాల్ నగర్ ఏసీపీ నరేష్ రెడ్డి, జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేశం, డిఐ కనకయ్య, ఎస్సైలు మరియు బాల్ నగర్ సిసిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
Related Posts
Latest News
04 Jun 2025 21:54:12
హైదరాబాద్: కూకట్ పల్లి డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు ఇద్దరు ఏపీ పోలీసులను అరెస్ట్ చేశారు. తిరుపతిలో టాస్క్...