అధికవడ్డి ఆశ చూపి.. పంగానామాలు పెట్టిన పెంగున్ సెక్యూరిటీ సంస్థ..
By Ravi
On
కుత్బుల్లాపూర్: జీడిమెట్ల పిఎస్ పరిధిలోని చింతల్ లో భారీమోసం బయట పడింది. వందల సంఖ్యలో బాధితులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి తమగోడు వెళ్లబోసుకున్నారు. ది పెంగున్ అనే సెక్యూరిటీ పేరిట బాండ్ ల రూపంలో 1500మంది కస్టమర్లను మోసం చేసి బిచాణ ఎత్తేసింది. లక్ష రూపాయల డిపాజిట్ చేస్తే లక్ష లాభం ఇస్తామని చెప్పడంతో అత్యాశకు పోయిన జనం లక్షల్లో డిపాజిట్లు, చిట్స్ వేశారు. అలా 1500మంది కస్టమర్ల వద్ద 150 కోట్లు కొల్లగొట్టి కంపెనీ నిర్వాహకులు పరారయ్యారు. తాము మోస పోయామని గ్రహించిన బాధితులు జీడిమెట్ల పిఎస్ కి క్యూ కట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Latest News
01 Jun 2025 21:37:44
కాలం చెల్లిన ఎక్సైజ్ ప్రభుత్వ కార్యాలయం భవనం పైకప్పు అకస్మాత్తుగా కొంత భాగం కూలడంతో ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రంగారెడ్డి జిల్లా...