బాధితుల ఫిర్యాదులను నమోదు చేయండి: డిజిపి డాక్టర్ జితేందర్..

By Ravi
On
బాధితుల ఫిర్యాదులను నమోదు చేయండి: డిజిపి డాక్టర్ జితేందర్..

IMG-20250531-WA0105హైదరాబాద్: వివిధ రకాల సమస్యలతో పోలీస్ స్టేషన్లలో బాధితులు అందజేస్తున్న ఫిర్యాదులను నమోదు చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వివిధ యూనిట్ల నుండి వచ్చిన స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో శనివారం నాడు డిజిపి కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ.... శాంతి భద్రతల సమస్యలు ఎదురైనప్పుడు ప్రజలు పోలీస్ స్టేషన్ కి వస్తారని వారి ఇస్తున్న ఫిర్యాదులను నమోదు చేసి దర్యాప్తు చేయాలన్నారు. దీనివల్ల కేసుల సంఖ్య పెరుగుతుందేమో అనే సందేహాలు పెట్టుకోవద్దని కేసులు పెరిగినప్పటికీ పోలీసు అధికారులు స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఎవరూ ప్రశ్నించరని తెలిపారు. కేసులు నమోదు చేసిన తర్వాత దర్యాప్తులో వాస్తవాలను తెలుసుకొని బాధితులను రక్షించి నిందితులకు శిక్ష పడలే చేయాల నే క్రిమినల్ జస్టిస్ సిస్టం ను పాటించాలని తద్వారా ఉత్తమ పోలీస్  అధికారులుగా పేరు తెచ్చుకోవాలని సూచించారు. బాధితులకు సరైన న్యాయం జరగనప్పుడు మాత్రమే వారు వివిధ రకాల వ్యక్తులు దగ్గరికి వెళ్లి తిరిగి పోలీస్ స్టేషన్ కే సిఫారసులు తీసుకొస్తారని ముందుగానే బాధితులకు న్యాయం చేయడం ద్వారా ప్రజల్లో అభిమానాన్ని, విధి నిర్వహణలో సంతృప్తిని పొందవచ్చు అన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీసులు పౌర ఆధారిత పోలీసింగ్ చేయడం ద్వారా ప్రజలకు మేలు చేయవచ్చని పేర్కొన్నారు. కొన్ని విదేశీ కంపెనీలు హైదరాబాదులో శాంతిభద్రతలు సక్రమంగా ఉన్నాయని భావించి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని, కాలక్రమేనా హైదరాబాద్ మహానగరం మరింత అభివృద్ధి చెందుతుందనే ఆశాభవం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల వారు, మహిళలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి సక్రమంగా పనిచేసేలా శాంతి భద్రతలను కాపాడాలని డిజిపి అన్నారు. క్యూఆర్ కోడ్ ఆధారంగా ఇటీవల పోలీస్ స్టేషన్ల పనితీరును సమీక్షించినప్పుడు దాదాపు పది పోలీస్ స్టేషన్లో 100 శాతం ఫిర్యాదుదారులు సంతృప్తి వ్యక్తం చేశారని సంతోషం వ్యక్తం చేశారు. పది పోలీస్ స్టేషన్ల స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు సాధ్యమైనప్పుడు ఇతరులకు ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్లు చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు ఫిర్యాదులు నూరు శాతం సంతృప్తి వ్యక్తం చేస్తారని ఆయా ఫలితాలను క్యూఆర్ కోడ్ ద్వారా ఇతర ఏజెన్సీల ద్వారా తాము  సమీక్షిస్తామని డిజిపి వెల్లడించారు. మహిళా పోలీస్ సిబ్బంది సేవలను సమర్ధంగా వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ మహేశ్ ఎం భగవత్ మాట్లాడుతూ.... స్టేషన్ హౌస్ ఆఫీసర్ల పనితీరును సమీక్షించేందుకు క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఉపయోగపడుతుందని, ఫిర్యాదుదారులకు క్యూఆర్ కోడ్ పట్ల అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. రానున్న బక్రీద్ పండగ సందర్భంగా గోవుల అక్రమ రవాణా అరికట్టాలని, ఇతర రాష్ట్రాల నుండి గాని ఇతర జిల్లాల నుండి గాని వచ్చేవాటిపై నిఘా పెట్టాలని సూచించారు. గోవుల రక్షణ పేరిట ఇతరులు సమాచారం ఇస్తే తీసుకోవాలని , పరిస్థితులు వారి చేతిలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు. అరికట్టేందుకు కొత్త క్రిమినల్ చట్టాల్లో ఉన్న సెక్షన్లను నమోదు చేయడం ద్వారా యూనిట్ ఆఫీసర్ల నుంచి ప్రతిపాదనలను పంపి అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు. నకిలీ విత్తనాలను కేంద్రాలను మూసివేయాలన్నారు. తద్వారా రైతులను ఆదుకోవాలని అన్నారు. ఏఐజి రమణ కుమార్, డీఎస్పీ సత్యనారాయణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Latest News

కూలిన షాద్ నగర్ ఎక్సైజ్ కార్యాలయ పైకప్పు.. కానిస్టేబుల్ కి గాయాలు.. కూలిన షాద్ నగర్ ఎక్సైజ్ కార్యాలయ పైకప్పు.. కానిస్టేబుల్ కి గాయాలు..
కాలం చెల్లిన ఎక్సైజ్ ప్రభుత్వ కార్యాలయం భవనం పైకప్పు అకస్మాత్తుగా కొంత భాగం కూలడంతో ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రంగారెడ్డి జిల్లా...
బాలపూర్ ఎక్స్ రోడ్.. రెడ్డి సేవా సమితి నూతన కమిటీ ఏర్పాటు..
స్వామివారి సన్నిధిలో..చచ్చేలా కొట్టుకున్నారు..
జులై 11న లాల్ దర్వాజ అమ్మవారి బోనాలు..
డేట్ ఫిక్స్ అయ్యింది.. సార్ వస్తున్నారు.. గెట్ రెడీ..
ఆయన పనితీరు ఎస్టి ఎఫ్ టీమ్‌లకు ఎంతో ఉపయోగపడింది. ఎక్సైజ్ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం..
బాధితుల ఫిర్యాదులను నమోదు చేయండి: డిజిపి డాక్టర్ జితేందర్..