జులై 11న లాల్ దర్వాజ అమ్మవారి బోనాలు..

By Ravi
On
జులై 11న లాల్ దర్వాజ అమ్మవారి బోనాలు..

హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలోనే అత్యంత వైభవంగా, ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే పాతబస్తీ లాల్ దర్వాజ శ్రీ మహాంకాళి బోనాల జాతర ఉత్సవాలు జులై 11 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ సంవత్సరం 117వ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లను చేస్తోంది. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించనున్నారు. 11 నుండి ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలలో తొలిరోజైన శుక్రవారం ఉదయం గణపతి హోమం, సప్తశతి పారాయణం దేవి అభిషేకం, ధ్వజారోహణ, శిఖరవూజ, సాయంత్రం కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జులై 13వ తేదిన షాలిబండ కాశీవిశ్వనాథ స్వామి దేవాలయం నుండి అమ్మవారి ఘటంను భాజా భజంత్రీలు, డప్పు వాయిధ్యాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్టిస్తారు. ఆ తరువాత 9రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి పూజలు నిర్వహిస్తారు. జులై 20వ తేదిన ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పన, రాత్రికి ప్రపంచ శాంతిని కోరుతూ శాంతి కళ్యాణము నిర్వహిస్తారు. జులై 21వ తేదిన సోమవారం పోతరాజు స్వాగతం, రంగం, అమ్మవారి బ్రహ్మాండమైన ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయి.

దేశ రాజధాని ఢిల్లిలో లాల్ దర్వాజ బోనాలు...
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా దేశ రాజధాని ఢిల్లీ తెలంగాణ భవన్ లో గత 10 సం||ల నుండి బోనాలు ఉత్సవాలను నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం 11వ బోనాల ఉత్సవాలను లాల్ దర్వాజ సింహవాహిని శ్రీ మహాంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 30, జులై 1, 2 తేదీలలో బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నాము. సోమవారము 30వ తేదీన సాయంత్రం 5గం॥లకు తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఫోటో ఎగ్జిబిషన్ ను పలువురు ప్రముఖులు విచ్చేసి ప్రారంభిస్తారు. మంగళవారం 1వ తేదీన సా|| 4 గం॥లకు ఇండియా గేట్ నుండి అమ్మవారి ఘటాన్ని ఊరేగింపుగా తీసుకుని వచ్చి తెలంగాణ భవన్లో ప్రతిష్టాపన చేస్తాము. బుధవారం 2వ తేదీన ఉదయం 11గం॥లకు పోతరాజు స్వాగతం, బోనాల సమర్పణ, పలువురు ప్రముఖులు విచ్చేసి, అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సాయంత్రం 6 గం||లకు అంబేడ్కర్ ఆడిటోరియంలో ముగింపు కార్యక్రమము జరుగును.

Advertisement

Latest News

పెంగ్విన్ కేసును ఈఓడబ్ల్యుకి బదిలీ చేసిన పోలీసులు.. పెంగ్విన్ కేసును ఈఓడబ్ల్యుకి బదిలీ చేసిన పోలీసులు..
మేడ్చల్ జిల్లా:జీడిమెట్ల పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో సంచ‌లనం సృష్టించిన పెట్టుబ‌డుల‌తో మోసం చేసిన కేసును ఈఓడబ్ల్యూ కి బ‌దిలీ చేశారు.  చింత‌ల్ సూర్య‌న‌గ‌ర్‌లో పెంగ్విన్ సెక్యూరిటీస్ పేరుతో...
గోపన్నపల్లిలో జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ వేడుకలు.
పార్కింగ్ చేసిన వాహనాలే వారి టార్గెట్..
ఆబ్కారీ భవన్ లో అంబరాన్నంటిన తెలంగాణ సంబరాలు..
డిజిపి కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు..
బడంగిపేటలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..
కేసీఆర్.. పవన్ కళ్యాణ్ పై మండిపడిన సిపిఐ నారాయణ..