రోడ్డు వేయకుండా బిల్లు మంజూరు.. జీహెచ్ఎంసి ఆఫీస్ ముట్టడి..

By Ravi
On
రోడ్డు వేయకుండా బిల్లు మంజూరు.. జీహెచ్ఎంసి ఆఫీస్ ముట్టడి..

పాతబస్తీలోని జీహెచ్ఎంసి ఆఫీస్ వద్ద బీజేపీ ఆందోళనకు దిగింది. సింగరేణి బొంబాయి క్వార్టర్స్ లో సిసి రోడ్ ప్రారంభించక ముందే సీసీ రోడ్డు వేశామని కాంట్రాక్టర్లు సంతోష్ నగర్ సర్కిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి బిల్లుని  తీసుకోవడం జరిగింది. ఈ అవినీతిని మొత్తం  ఐఎస్ సదన్ డివిజన్ కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి అన్ని వివరాలతో బయట పెట్టారు.  దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని భాగ్యనగర్ జిల్లా నాయకులు,  కార్పొరేటర్ జంగం శ్వేతా మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు.  చార్మినార్ జోనల్ ఆఫీస్ (ఫుల్ బాగ్) వద్ద ధర్నా నిర్వహించారు. కనీసం  రోడ్డు వేయకుండా 15 లక్షల cc రోడ్డు వేసినట్లు బిల్లులు సమర్పించటం దానికి వత్తాసు పలుకుతూ ghmc అధికారులు బిల్లుకు చెక్ రిలీజ్ చేయటం పై విచారణ జరిపి అధికారులను మరియు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసిని మజ్లిస్ నేతలు తమ అధీనం లో పెట్టుకొని తమకు అనువైన కాంట్రాక్టర్ లకు పనులు ఇప్పిస్తున్నారని దీనిపై విచారణ చేసి కొత్త కాంట్రాక్టర్ లకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. కార్యక్రమంలో పెద్దఎత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Latest News

బాలపూర్ ఎక్స్ రోడ్.. రెడ్డి సేవా సమితి నూతన కమిటీ ఏర్పాటు.. బాలపూర్ ఎక్స్ రోడ్.. రెడ్డి సేవా సమితి నూతన కమిటీ ఏర్పాటు..
బాలాపూర్ X రోడ్డు *రెడ్డి సేవా సమితి* నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. చౌరస్తాలోని పలు కాలనీలలో నివసించే రెడ్డి కులస్తులను ఏకం చేసుకొని 18...
స్వామివారి సన్నిధిలో..చచ్చేలా కొట్టుకున్నారు..
జులై 11న లాల్ దర్వాజ అమ్మవారి బోనాలు..
డేట్ ఫిక్స్ అయ్యింది.. సార్ వస్తున్నారు.. గెట్ రెడీ..
ఆయన పనితీరు ఎస్టి ఎఫ్ టీమ్‌లకు ఎంతో ఉపయోగపడింది. ఎక్సైజ్ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం..
బాధితుల ఫిర్యాదులను నమోదు చేయండి: డిజిపి డాక్టర్ జితేందర్..
అక్షయ విద్య ఫౌండేషన్ ను అభినందించిన డీజీపీ జితేందర్..