రోడ్డు వేయకుండా బిల్లు మంజూరు.. జీహెచ్ఎంసి ఆఫీస్ ముట్టడి..

By Ravi
On
రోడ్డు వేయకుండా బిల్లు మంజూరు.. జీహెచ్ఎంసి ఆఫీస్ ముట్టడి..

పాతబస్తీలోని జీహెచ్ఎంసి ఆఫీస్ వద్ద బీజేపీ ఆందోళనకు దిగింది. సింగరేణి బొంబాయి క్వార్టర్స్ లో సిసి రోడ్ ప్రారంభించక ముందే సీసీ రోడ్డు వేశామని కాంట్రాక్టర్లు సంతోష్ నగర్ సర్కిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి బిల్లుని  తీసుకోవడం జరిగింది. ఈ అవినీతిని మొత్తం  ఐఎస్ సదన్ డివిజన్ కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి అన్ని వివరాలతో బయట పెట్టారు.  దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని భాగ్యనగర్ జిల్లా నాయకులు,  కార్పొరేటర్ జంగం శ్వేతా మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు.  చార్మినార్ జోనల్ ఆఫీస్ (ఫుల్ బాగ్) వద్ద ధర్నా నిర్వహించారు. కనీసం  రోడ్డు వేయకుండా 15 లక్షల cc రోడ్డు వేసినట్లు బిల్లులు సమర్పించటం దానికి వత్తాసు పలుకుతూ ghmc అధికారులు బిల్లుకు చెక్ రిలీజ్ చేయటం పై విచారణ జరిపి అధికారులను మరియు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసిని మజ్లిస్ నేతలు తమ అధీనం లో పెట్టుకొని తమకు అనువైన కాంట్రాక్టర్ లకు పనులు ఇప్పిస్తున్నారని దీనిపై విచారణ చేసి కొత్త కాంట్రాక్టర్ లకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. కార్యక్రమంలో పెద్దఎత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Latest News

ప్రాణాలు పణంగా పెట్టి పని చేస్తే.. ఇలాగేనా మాట్లాడేది.. ప్రాణాలు పణంగా పెట్టి పని చేస్తే.. ఇలాగేనా మాట్లాడేది..
By.. V.Krishna kumar Tpn: స్పెషల్ డెస్క్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటన బాధిత కుటుంబ సభ్యుల ఆరోపణలను అగ్నిమాపక శాఖ ఖండించారు. పొగడ్తలు మాకు...
కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్ పై ఉన్న ప్రేమ భారత దేశ త్రివిధ దళాల పై లేదు. రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్
సీతక్క సహాయం.. మూర్చరోగికి వైద్యం...
అధికవడ్డి ఆశ చూపి.. పంగానామాలు పెట్టిన పెంగున్ సెక్యూరిటీ సంస్థ..
వేర్వేరు ప్రాంతాల్లో ఎక్సైజ్ దాడి.. డ్రగ్స్..గంజాయి స్వాధీనం..
షాద్ నగర్ లో ఎస్ఓటి దాడి.. భారీగా డ్రగ్స్ స్వాధీనం..
భూభారతి చట్టంపై జూన్ 3 నుండి  రెవెన్యూ సదస్సులు..