లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ..

By Ravi
On
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ..

లంచం తీసుకుంటూ ఓ ఎస్ఐ ఏసీబీకి చిక్కిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషనులో చోటు చేసుకుంది.  ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బల్కంపేటకి చెందిన హరి కమల్ బ్యాండ్ సిబ్బంది జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ శుభకార్యకానికి హాజరై బ్యాండ్ వాయించారు. కాగా శబ్ద కాలుష్యానికి పాలపడుతున్నారని ఆ బ్యాండ్ కు చెందిన వాహనాన్ని సామాగ్రిని ఎస్ ఐ శంకర్ సీజ్ చేసాడు.. ఆవాహనాన్ని సామాగ్రిని హరికమల్  బ్యాండ్ సిబ్బందికి తిరిగి ఇచ్చేందుకు 15 వేల రూపాయలు డిమాండ్ చేశాడు. ఆ మొత్తాన్ని జగద్గిరిగుట్టకు చెందిన నాగేందర్ ను మధ్యవర్తిగా పెట్టుకొని, ఆ మొత్తాన్ని తనకు ఇవ్వాలని బాధితులను కోరాడు. ఎస్ ఐ వేధింపులు తాళలేక, బాధితుడు ఏసీబీ కి ఫిర్యాదు చేయగా, డిమాండ్ మేరకు శనివారం బాధితుడు 15 వేల రూపాయల నగదును మధ్యవర్తి నాగేందర్ కు అందజేశారు. అతడు ఆ మొత్తాన్ని ఎస్ ఐ కు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అవినీతికి పాల్పడిన ఎస్ ఐ శంకర్, అతనికి సహకరించిన నాగేందర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Tags:

Advertisement

Latest News

నన్ను వేశ్యలాగా చూశారు..వివాదాస్పదమైన మిస్ వరల్డ్ పోటీలు నన్ను వేశ్యలాగా చూశారు..వివాదాస్పదమైన మిస్ వరల్డ్ పోటీలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలు అపవాదును మూటగట్టుకుంది. ఈ పోటీల్లో ఖండాల వారీగా 24 మంది విజేతలను ఎంపిక చేశారు. వారిలో...
కల్వ సుజాతపై డీఎస్పీకి ఫిర్యాదు..
టాలీవుడ్‌ ఫోర్‌ పిల్లర్స్‌కు పవన్‌ రిటర్న్‌ గిఫ్ట్‌..!
అధిక పెన్షన్‌ పై అయోమయం.. పోరాటానికి సిద్ధమైన సంఘం
గ్రామ పాలన అధికారి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి - సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్
కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ..