దొంగనోట్లతో భారీ స్కెచ్ వేశాడు.. ఇంతలో
By Ravi
On
మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పరిధిలో ఓ దొంగనోట్ల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీసుకున్న అప్పు తిరిగి ఇమ్మని అడిగితే నకిలీ నోట్లు ఇచ్చి అడ్డంగా బుక్కయ్యారు. ఈనెల 17వ తేదీన మనీషా సావంత్ అనే మహిళ కుంజురామ్ పటేల్ అకౌంట్ కి (18.5లక్షలు) ట్రాన్స్ ఫర్ చేసింది. తన వద్ద తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలని కోరగా నగదు రూపంలో ఇస్తానని ఫోన్ చేసి ఫ్యాంథాలూన్ షాపింగ్ కి కుంజురామ్ పటేల్ రప్పించాడు. అనంతరం ఆమెకు పిల్లలు ఆడుకునే 500 రుపాయల దొంగనోట్లు ఇచ్చాడు. విషయం పసిగట్టి మందలించబోయిన మనీషాని చూసి కుంజురామ్ పటేల్, అతని స్నేహితులు పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేసి కోర్ట్ లో హాజరు పరిచారు.
Tags:
Latest News
20 May 2025 08:58:59
మీకు వయసు మీద పడిందా.. వృద్ధాప్యంలో ఓ తోడు కావాలని చూస్తున్నారా.. మళ్లీ పెళ్లి చేసుకుంటే పిల్లను ఎవరు ఇస్తారు అని ఆలోచిస్తున్నారా.. డోంట్ వర్రీ.. బీ...