హైదరాబాద్ లో పేలుళ్లకు ప్లాన్.. భగ్నం చేసిన పోలీసులు
పహెల్గావ్ ఘటన నుండి ఇంకా జనం తేరుకొని లేదు. ఇంతలో అలజడి రేకెత్తించే సమాచారం పోలీస్ శాఖకు అందింది. హైదరాబాద్ లో పేలుళ్లకు ప్లాన్ వేశారు ముష్కర ముక్కలు. విషయం తెలియగానే అప్రమత్తమైన తెలంగాణ ఇంటెలిజెన్స్.. ఏపీ, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. హైదరాబాద్ లో పేలుళ్లకు ప్లాన్ చేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్ కు చెందిన సమీర్ ఇద్దరు కలిసి ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. హైదరాబాద్ లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి వరుస పేలుళ్లకు పాల్పడాలని భావించారు. విషయం పసిగట్టిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసిన సిరాజ్, సమీర్ తో కలిసి డమ్మీ బ్లాస్ట్ కు ప్లాన్ చేశారు. దాని ద్వారా జనాలను భయబ్రాంతులకు గురి చేయాలని అనుకున్నారు. ఈ పేలుళ్లకు సౌదీ అరేబియా నుంచి సిరాజ్, సమీర్ కు ఐసిస్ మాడ్యుల్ ఆదేశాలు ఇచ్చినట్లు విచారణలో తేలింది. పేలుడు పదార్థాల కొనుగోలు కోసం ఆర్ధికంగా సహకరించినట్లు తెలుస్తోంది. తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ తో పాటు ఏపీ ఇంటెలిజెన్స్ జాయింట్ ఆపరేషన్ మొత్తానికి ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి వారి ప్లాన్ తలకిందులు చేశారు. వీరికి సహకరించిన వారి కోసం వేట మొదలు పెట్టారు.