పాతబస్తీ ప్రమాదంలో 17కి చేరిన మృతుల సంఖ్య

By Ravi
On
పాతబస్తీ ప్రమాదంలో 17కి చేరిన మృతుల సంఖ్య

పాతబస్తీ చార్మినార్ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 17కి చేరింది. మరికొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. గాయపడిన వారిని మలక్ పేట యశోద ఆస్పత్రితో పాటు కాన్చన్ బాగ్ అపోలో డిఆర్డీఓ ఆస్పత్రికి తరలించారు. మృతులు బెంగాల్ వాసులని తెలిసింది. సమ్మర్ హాలిడేస్ కావడంతో తమ కుటుంబ సభ్యులతో కలిసి చార్మినార్ వద్ద బంధువుల ఇంటికి వచ్చినట్లు, తెల్లవారు జామున అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ఊపిరాడక చాలా మంది చనిపోయినట్లు తెలుస్తోంది. విషయం తెలియగానే పలువురు మంత్రులు, మేయర్ ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్నారు. ఘటన స్థలానికి వచ్చిన డీజీపీ జితేందర్, ఫైర్ డిజి నాగిరెడ్డి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మరోపక్కన సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేటీఆర్ పలువురు ప్రజాప్రతినిధులు తమ సంతాపం తెలియజేశారు. ప్రస్తుతం ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారిలో చాలా మంది పరిస్థితి ఆందోళనగా ఉందని 48గంటలు గడిస్తేగాని చెప్పలేమని వైద్యులు వెల్లడించారు. ప్రమాదంపై అనేక కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

తెలంగాణలో మందుబాబులకు ఊహించని షాక్ తెలంగాణలో మందుబాబులకు ఊహించని షాక్
తెలంగాణ రాష్ట్రంలో మందు బాబులకు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ధరల మోతతో ఇబ్బంది పడుతున్న మందుబాబులు, తాజాగా మరో మారు లిక్కర్ ధరలు పెంచాలని ప్రభుత్వం...
హైదరాబాద్ లో పేలుళ్లకు ప్లాన్.. భగ్నం చేసిన పోలీసులు
కలర్ ఫుల్ గా మారిన కమాండ్ కంట్రోల్ సెంటర్
హైదరాబాద్ లో మరో ప్రమాదం.. రెస్క్యూ ఆపరేషన్..50మంది సేఫ్
చర్లపల్లిలో ట్యాంకర్ లో చెలరేగిన మంటలు
103వ రోజుకి చేరుకున్న డంపింగ్ యార్డ్ వ్యతిరేఖ నిరాహారదీక్ష
తెలంగాణలో పలుచోట్ల ఎక్సైజ్ అధికారుల దాడులు.. బెల్లం ఆలం పటిక స్వాధీనం