ఎంపీ ఈటెల ఇంటి వద్ద ఫుల్ టెన్షన్.. భారీగా చేరుకున్న బీజేపీ నేతలు
By Ravi
On
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ చేసిన అనుచిత వాక్యాలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నాయకులు ఆయన ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. యూత్ కాంగ్రెస్ నాయకులను అడ్డుకునేందుకు మేడ్చల్ పూడూరులోని ఎంపి ఈటల రాజేందర్ ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. యూత్ కాంగ్రెస్ నాయకుల ఆందోళన విషయం తెలుసుకున్న బిజెపి, బిజెవైఎం నాయకులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకున్నారు. ముఖ్య నేతలు ఈటెలతో సమావేశం అయ్యారు. యూత్ కాంగ్రెస్ నాయకులు వస్తే సహించేది లేదని పలువురు కార్యకర్తలు హెచ్చరించారు.
Tags:
Latest News
12 May 2025 19:57:59
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా గాంధీలో ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి నిర్వహించారు. ఆమె చిత్రపటం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. గాంధీలో నిత్యం నర్సులు విశేష సేవలు...