ఘనంగా కట్టమైసమ్మ జాతర.. భారీగా హాజరైన భక్తులు
By Ravi
On
శామీర్ పేట్ కట్ట మైసమ్మ జాతర కన్నుల పండుగగా జరిగింది. అమ్మవారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో భవిష్యవాణి, పోతురాజు గావు, సర్వు గంప ఊరేగింపు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేశారు. అమ్మవారికి మల్కాజ్ గిరి ఎంపి ఈటల రాజేందర్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జీ వజ్రేష్ యాదవ్, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహులు యాదవ్, నాయకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Tags:
Latest News
12 May 2025 19:57:59
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా గాంధీలో ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి నిర్వహించారు. ఆమె చిత్రపటం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. గాంధీలో నిత్యం నర్సులు విశేష సేవలు...