గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ లో విద్యార్థిని సూసైడ్
గురునానక్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థిని హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా, తల్లాడ మండలం, కురన వెళ్లి గ్రామానికి చెందిన అల్లూరి భావన(22), తండ్రి పేరు శశిరెడ్డి. కాగా రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి సమీపంలో ఉన్న గురునానక్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. శనివారం ఉదయం 10 గంటలకు హాస్టల్లో ఉరివేసుకొని చనిపోయింది. భావన తల్లిదండ్రులు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు, మరొక అమ్మాయి జూబ్లీహిల్స్ లో బిఎస్సి నర్సింగ్ చదువుతుంది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న స్టూడెంట్ సంఘాల నేతలు కాలేజ్ వద్దకు చేరుకున్నారు. విషయం గమనించిన కాలేజ్ యాజమాన్యం గేట్లు మూసి వేయడంతో విద్యార్థులు గేట్ ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు కళాశాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు