క్షమించాలి రేపు విచారణకు రాలేను.. ఈడీకి లేఖ రాసిన హీరో మహేష్ బాబు

By Ravi
On
క్షమించాలి రేపు విచారణకు రాలేను.. ఈడీకి లేఖ రాసిన హీరో మహేష్ బాబు

ప్రముఖ టాలీవుడ్ నటుడు మహేశ్ బాబు  ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)కి లేఖ రాశారు. షూటింగ్ ఉన్నందున సోమవారం విచారణకు హాజరు కాలేనని ఆ లేఖలో పేర్కొన్నారు. విచారణ కోసం మరో తేదీ కేటాయించాలని ఈడీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. సాయిసూర్య డెవలపర్స్, సురానా ప్రాజెక్టు కేసుల్లో కొన్ని రోజుల క్రితం మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మహేశ్ బాబు ఆ రెండు సంస్థలకు ప్రచార కర్తగా ఉన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఇన్ ఫ్లుయెన్స్ చేశారనే అభియోగంపై ఈడీ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 28న హైదరాబాద్ బషీర్ బాగ్  లో గల ఈడీ కార్యాలయానికి రావాలని ఆదేశించింది. పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన పాస్ బుక్స్ తీసుకురావాలని సూచించింది.  సాయి సూర్యకి సంబంధించి దాదాపు రూ. 100 కోట్ల అక్రమ లావాదేవీలను ఈడీ గుర్తించింది. రూ. 74.5 లక్షల నగదు సీజ్ చేసింది. మహేశ్ బాబుకు చెక్కుల రూపంలో రూ. 3.4 కోట్లు, నగదు రూపంలో 2.5 కోట్ల చెల్లింపులు చేసినట్లు ఆధారాలు సేకరించారు.MV5BNGFjOThlZjYtMGEzYi00ZDQ3LThmMzMtYTdiZjJmNTdhYjllXkEyXkFqcGc@._V1_FMjpg_UX1000_

Tags:

Advertisement

Latest News

రాసిపెట్టుకోండి వచ్చేది మనమే.. ఇచ్చేది మనమే.. కేసీఆర్ రాసిపెట్టుకోండి వచ్చేది మనమే.. ఇచ్చేది మనమే.. కేసీఆర్
రాసిపెట్టుకోండి ఇక వచ్చేది మనమే.. ప్రజలకు సంక్షేమం చేస్తుంది మనమే.. కల్లబొల్లి కబుర్లు చెప్పము.. చెప్పింది చేసి చూపిస్తాము.  ప్రత్యేక రాష్ట్రం కోసం పడ్డ కష్టం కాంగ్రెస్...
7నెలల బాలుడికి మెటబాలిక్ డిజార్డర్.. సాయం కోసం తల్లిదండ్రుల వినతి
సరూర్ నగర్ లో భారతీయ సైనికుల క్షేమం కోసం ప్రత్యేక పూజలు
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు
క్షమించాలి రేపు విచారణకు రాలేను.. ఈడీకి లేఖ రాసిన హీరో మహేష్ బాబు
తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధానకార్యదర్శిగా రామకృష్ణారావు నియామకం
లారీలో పట్టుబడిన 30కేజీల గంజాయి.. ముగ్గురు అరెస్ట్