జైహింద్ అంటూ ఎక్స్ లో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పోస్ట్

By Ravi
On
జైహింద్ అంటూ ఎక్స్ లో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పోస్ట్

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత రక్షణ దళాలు దాడులు నిర్వహించాయన్న వార్తల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయకులు సైతం ఈ చర్యను స్వాగతిస్తూ, భారత సత్తాను చాటారని ప్రశంసించారు.ఈ దాడులను పహల్గామ్ ఉగ్రదాడికి సరైన ప్రతీకారమని అభిప్రాయపడ్డారు. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈ దాడులను స్వాగతిస్తూ 'ఎక్స్' వేదికగా స్పందించారు. "పాకిస్థాన్‌లోని ఉగ్రవాద రహస్య స్థావరాలపై మన రక్షణ దళాలు జరిపిన లక్షిత దాడులను నేను స్వాగతిస్తున్నాను. మరో పహల్గామ్ వంటి ఘటన పునరావృతం కాకుండా పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం చెప్పాలి. పాకిస్థాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలి," అని ఒవైసీ పేర్కొన్నారు. తన పోస్ట్‌ను ఆయన 'జై హింద్' నినాదంతో ముగించారు.

Tags:

Advertisement

Latest News

భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ
పహల్గామ్‌ దాడికి ప్రతీకారం తీర్చుకున్న భారత్‌- చావు తప్పి కన్నులొట్టపోయిన పాకిస్తాన్‌..!- యుద్ధంతో చావుదెబ్బ తిన్న దాయాది- రెండురోజుల్లోనే చేతులెత్తేసిన పాక్‌- లాహోర్‌లో పాక్‌ రాడార్‌ వ్యవస్థ...
బడంగిపేటలో బిఆర్ఎస్ భారీ ర్యాలీ
ఎక్స్ వేదికగా జర్నలిస్టులను అభినందించిన సజ్జనార్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద గంజాయి అమ్మకం.. నలుగురు అరెస్టు
అత్తాపూర్ లో ఓ ఇంటిపై దాడి.. అల్ఫాజోలం స్వాధీనం
కాంగ్రెస్ లీడర్లకే ఇందిరమ్మ ఇండ్ల.. నిలదీసిన మహిళలు
జూబ్లీహిల్స్ టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద భారీ భద్రత