రోహింగ్యాలను వెంటనే తరలించాలని డిమాండ్..!
By Ravi
On
నగరంలో అక్రమంగా నివాసముంటున్న రోహింగ్యాలను వెంటనే ఇక్కడి నుంచి తరలించాలని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్ డిమాండ్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో రోహింగ్యాలు అక్రమంగా నివసించే ప్రాంతాన్ని పరిశీలించి.. అనంతరం బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో దాదాపు 20 వేల మంది రోహింగ్యాలు ఉన్నారని.. వారికి ఇక్కడున్న వారే షెల్టర్ ఇస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా బాలాపూర్ ఎమ్మార్వో, పోలీసు శాఖ సమగ్ర దర్యాప్తు నిర్వహించి 15 రోజుల్లోపు వారిని గుర్తించి ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తామే వారిని తరిమి కొడతామని హెచ్చరించారు.
Related Posts
Latest News
06 May 2025 22:04:02
మేడ్చల్ జిల్లా: కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం విలేజ్లో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. సర్వే నంబరు 354లో ఉన్న ప్రభుత్వ భూమిలో కబ్జాలను...