శ్రీ తేజ్ ని పరామర్శించిన అల్లు అరవింద్

By Ravi
On
శ్రీ తేజ్ ని పరామర్శించిన అల్లు అరవింద్

ఇటీవలే కిమ్స్ ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయిన శ్రీతేజ్ ను అల్లు అరవింద్ పరామర్శించారు. రీ హాబ్  కు వెళ్లి డాక్టర్లను కలిసి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. శ్రీ తేజ్ కోలుకోవటం కోసం తమ కుటుంబం అంతా ఎదురుచూస్తోందని, శ్రీతేజ్  రోజురోజుకు కోలుకుంటున్న విషయం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు. శ్రీ తేజ్ చికిత్సకు సహకరిస్తున్నారు అని చెప్పిన డాక్టర్లు చెప్పడంతో అరవింద్ ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే 2 కోట్లు శ్రీతేజ్ అకౌంట్ లో  అల్లు అర్జున్, పుష్ప యూనిట్  డిపాజిట్ చేశారు. త్వరలోనే శ్రీ తేజ్ మనందరి మధ్య అందరి పిల్లల్లా ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:

Advertisement

Latest News