ట్రంప్‌ చర్చలపై చైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

By Ravi
On
ట్రంప్‌ చర్చలపై చైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

అమెరికా, చైనాల మధ్య టారీఫ్ చర్చలు కారణంగా ట్రేడ్ వార్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. టారిఫ్‌ లపై విస్తృతస్థాయిలో చర్చలు జరిపేందుకు అమెరికా అధికారుల బృందం చైనా అధికారులను సంప్రదించింది. తాజాగా ఈ విషయంపై బీజింగ్‌ స్పందిస్తూ.. వాషింగ్టన్‌ రీసెంట్ గా తీసుకున్న ట్రేడ్ విధాన నిర్ణయాలు, సుంకాల తగ్గింపు విషయంపై అగ్రరాజ్యంతో చర్చలు జరపాలా..? వద్దా.. అని ఆలోచిస్తున్నట్లుగా ఈ సందర్భంగా వెల్లడించింది. టారిఫ్ సమస్యలపై బీజింగ్‌తో చర్చలు జరపాలనే ఆశను వ్యక్తంచేస్తూ అమెరికా సంబంధిత వర్గాల ద్వారా అనేకసార్లు సందేశాలను పంపింది. దీంతో చర్చల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే విషయాన్ని అధికారులతో  సంప్రదించి ఓ అంచనాకు వస్తాము అని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

ప్రస్తుతం చైనా చెబుతున్న ఈ వ్యాఖ్యలు పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధ వాతావరణం ఏర్పడింది. అలాంటిది ఇప్పుడు తాజాగా జరిగిన మీటింగ్ ఆ ఉద్దేశ్యం ఇరు దేశాల మధ్య తొలగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే తమపై టారిఫ్‌ విధిస్తూ.. వాణిజ్య యుద్ధాన్ని అమెరికా ఏకపక్షంగా ప్రారంభించిందని వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి అన్నారు. ఇప్పుడు ఆ దేశం తమతో చర్చలు జరపాలంటే తమతో నిజాయతీగా ఉండాలని తెలిపారు. బీజింగ్‌తో వ్యవహరిస్తున్న తప్పుడు పద్ధతులను సరిదిద్దుకొని.. తమపై విధించిన ఏకపక్ష సుంకాలను ఎత్తివేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అప్పుడే అమెరికాతో బీజింగ్‌ సానుకూల చర్యలు చేపడుతుందని తెలిపారు.

Advertisement

Latest News

ఓల్డ్ సిటీ బాబానగర్ లో టెన్షన్... భారీ బందోబస్తు ఓల్డ్ సిటీ బాబానగర్ లో టెన్షన్... భారీ బందోబస్తు
పాతబస్తీలో ఫుల్ టెన్షన్ నెలకొంది. చాంద్రాయణగుట్టలో తెల్లవారుజామున హైడ్రా రంగంలోకి దిగడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. బాబానగర్ సర్వే నెంబర్ 303, 306 కి చెందిన 2000...
జైహింద్ అంటూ ఎక్స్ లో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పోస్ట్
కారులో బెల్లంఆలం తరలింపు..గుట్టురట్టు చేసిన ఎక్సైజ్ టీమ్
15 ఎకరాల భూమి కబ్జా.. రంగంలోకి హైడ్రా
మీర్పేట్ లో బిఆర్ఎస్ నేతల సంబరాలు
ఇంట్లోనే మినీ వైన్స్.. ఎక్సైజ్ పోలీసుల రైడ్
రేపు నగరంలో ఈ 4 కీలక ప్రాంతాల్లో మాక్ డ్రిల్