కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

By Ravi
On
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

మహేశ్వరం నియోజకవర్గంలోని మిర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల కింద 83 చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "చెక్కులు తీసుకున్న కుటుంబాలు తులం బంగారం ఎక్కడ అని ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. ప్రజల హక్కుల కోసం, హామీల నెరవేర్పు కోసం నిరంతరం పోరాడతాం," అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బాలాపూర్ ఎమ్మార్వో, మిర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ జ్ఞానేశ్వర్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి, దిండు భూపేష్ గౌడ్, అరకల భూపాల్ రెడ్డి, దీప్లాల్ చౌహాన్, శీను నాయక్, బొక్క రాజేందర్ రెడ్డి, మదారి రమేష్, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు సునీత బాలరాజ్, పంతంగి మాధవి, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest News

మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కి హైకోర్టులో చుక్కెదురు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కి హైకోర్టులో చుక్కెదురు
బీజేపీ నాయకుడు, మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన ఒక క్రిమినల్ కేసును రద్దు చేయాలని కోరుతూ ఆయన...
దేవుడా వీటిని కూడా నకిలీ చేశారా
మెట్రోలో సాంకేతిక లోపం.. అవస్థలు పడ్డ ప్రయాణికులు
ఎస్సీ వర్గీకరణ అనంతరం జాబ్ క్యాలెండర్ వేగం పెంపు
టీజీబీసీఎల్‌ కొత్త జీఎం గుండమనేని శ్రీనివాస్‌రావు బాధ్యతల స్వీకరణ
ఆటల్లో.. చదువుల్లో టాపర్ గా నిలిచిన ఓల్డ్ సిటీ స్టూడెంట్ హేమలత
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన షానవాజ్ ఖాసీం