పలాసా పనస పండ్ల నెపంతో గంజాయి రవాణా. ఎక్సైజ్ దాడి.. ఇద్దరి అరెస్ట్

By Ravi
On
పలాసా పనస పండ్ల  నెపంతో గంజాయి రవాణా. ఎక్సైజ్ దాడి.. ఇద్దరి అరెస్ట్

IMG-20250428-WA0152
ఎక్సైజ్ శాఖ తన పటిష్టమైన సమాచార వ్యవస్థతో  మత్తు పదార్థాల అక్రమ రవాణా చేసే ముఠాల పై కన్నేసి ఎప్పటికప్పుడు వారిని పట్టుకుని కటకటాల పాలు చేస్తున్నది. ఆ భయంతో మత్తు పదార్థాల అక్రమ రవాణా దారులు ఎక్సైజ్ శాఖ కల్లుగప్పి,  కొత్త ఎత్తుగడలతో తమ  వ్యాపారం కొనసాగించే  ప్రయత్నం చేసిన ఎక్సైజ్ శాఖ వి బి కమలాసన్ రెడ్డి డైరెక్టర్  దిశా నిర్దేశంతో  మత్తు పదార్థాల అక్రమ రవాణా చేసే స్మగ్లర్ల ఎత్తుగడలను ఎప్పటికప్పుడు పసిగడుతూ మత్తు పదార్థాల అక్రమ వ్యాపారస్తుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ఇదే క్రమంలో ఒడిషా నుంచి ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా పలాస,  విశాఖపట్నం విజయవాడ మీదుగా రాష్ట్రానికి 2.5కోట్ల  విలువ చేసే గంజాయిని పెద్ద ఎత్తున రవాణా చేస్తున్నారనే సమాచారం అందగా,   స్టేట్ టాస్క్ ఫోర్స్ అడిషనల్ ఎస్పీ భాస్కర్ అండ్ టీమ్ గంజాయి తరలిస్తున్న  ముఠా  కదలికలపై నిఘా వేసి వారిని పట్టుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినారు. బాస్ ఆదేశాలపై అడిషనల్ ఎస్పి భాస్కర్ స్టేట్ టాస్క్ ఫోర్స్ టీం "సి"  డి.ఎస్. పి. తులా శ్రీనివాసరావు మరియు వారి ఇన్స్పెక్టర్ కె వెంకటేశ్వర్లు సిబ్బందికి అప్రమత్తం చేయడం జరిగింది.   అదేవిధంగా టీం "  డి " డి.ఎస్. పి .తిరుపతి యాదవ్ మరియు ఇన్స్పెక్టర్ నాగరాజు లను కూడా  సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి, గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకోమని ఆదేశాలు జారీ  చేసినారు.  ఆ ఆదేశాలపై స్టేట్ టాస్క్ ఫోర్స్ టీం " సి " " డి " మరియు మేడ్చల్  ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా పెద్ద ఎత్తున గంజాయిని తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ.2.5 కోట్ల రూపాయల విలువ చేసే (410) కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 
మహారాష్ట్ర లోని ఉస్మానాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన గణేష్ రామస్వామి ఒక ప్రైవేటు డ్రైవర్ గా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు.  కానీ అతనికి వచ్చే జీతం డబ్బులతో సంతృప్తి చెందక మరేదైనా అక్రమ మార్గంలో ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించాలని దురాశతో  రత్నా భాయి  అనే గంజాయి వ్యాపారం చేసే  ఒక వ్యక్తి పరిచయం పెంచుకున్నాడు. గంజాయి వ్యాపారంలో డబ్బులు ఎక్కువ మొత్తంలో సంపాదించవచ్చని గణేష్ రామస్వామి కి చెప్పగా గణేష్ లో అప్పటికే ఉన్న దురాశ మరింతగా పెరిగింది. అందుకుగాను,  అతనితోపాటు డ్రైవింగ్ వృత్తిలో ఉన్న విజయ్ శంకర్ కులకర్ణి అనే వ్యక్తి సహకారం కోరాడు.  అందుకు అతను కూడా తన సహకారం అందించుటకు అంగీకరించగా తర్వాత గణేష్ రామస్వామి తమ గంజాయి అక్రమ రవాణాకు సులువుగా ఉంటుందనే  ఉద్దేశంతో ఒక మహీంద్రా మినీ వ్యాను కూడా కొనుగోలు చేశారు. అప్పటికే గంజాయి అక్రమ వ్యాపారంలో ఆరితేరిన రత్నా బాయ్ సహకారంతో ఒడిశాలోని గంజాయి సరఫరా దారులతో పరిచయం చేసుకొని గంజాయి అక్రమ వ్యాపారానికి తెర లేపినారు. 
ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్  ఆదేశాలతో ప్రోహిబిషన్  అండ్ ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ నిందితుల కదలికలపై సుమారు (20)  రోజులుగా నిఘా పెట్టి వారి కదలికలను క్షుణ్ణంగా నిశితంగా గమనిస్తున్న క్రమంలో నిందితులు వ్యానులో గంజాయిని తరలిస్తున్నారని పకడ్బందీ సమాచారం రాగా ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో మాటు వేసిన  ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ మరియు మేడ్చల్ ఎక్సైజ్ అధికారులు గంజాయి అక్రమ రవాణా చేసే ముఠా కోసం ఎదురు చూస్తున్న క్రమంలో  ఔటర్ రింగ్ రోడ్డు లో మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ కలిగిన మహేంద్ర మినీ వ్యాన్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారుల కంటపడింది.  వెంటనే  వ్యాను  ఆపి తనిఖీ చేయగా, పనస పళ్ల లోడుతో  కనిపించింది. అందులో ఉన్న వ్యక్తులను విచారించగా,  వారు తాము పళ్ల వ్యాపారం చేస్తామని,  శ్రీకాకుళం జిల్లా పలాస నుండి పనస పళ్ళను మార్కెట్ కు తరలిస్తున్నామని చెప్పినారు.  అనుమానాస్పదంగా ఉన్న వారి హావభావాలను గమనిస్తూ వ్యానును క్షుణ్ణంగా తనిఖీ చేసిన టాస్క్ ఫోర్స్ అధికారులు ఆశ్చర్య పోయినారు.  రహదారిపై తనిఖీ అధికారుల కళ్లు గప్పడానికి నిందితులు పనస పళ్ల లోడ్ కింది భాగంలో గంజాయిని నింపి, అనుమానం రాకుండా ఆ గంజాయి పై పనస పళ్ళను పోసి తీసుకు వెళుతున్నట్టుగా గమనించారు.  వారిని అదుపులోకి తీసుకొని విచారించారు.
నిందితుల వివరాలు: 
1. గణేష్ రామస్వామి, s/o. రాము, 27  సంలు. R/o. ఉస్మానాబాద్ మహారాష్ట్ర .
2. విజయ్ శంకర్ కులకర్ణి,  s/o. శంకర్ రావు కులకర్ణి,  వయస్సు 53 సంవత్సరాలు R/o. ఉస్మానాబాద్ మహారాష్ట్ర.

నిందితులు గంజాయిని కిలో చొప్పున విడదీసి  చిన్న ప్యాకెట్ల లోనికి మార్చి బీదర్, తాండూర్,  వికారాబాద్ మరియు హైదరాబాద్ లో మత్తు పదార్థాలకు బానిసైన వ్యక్తులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. 
నిందితులను పట్టుకుని పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకోవడం లో శ్రమించిన అధికారులు మరియు సిబ్బంది
1. కె. వెంకటేశ్వర్లు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఎస్ . టి. ఎఫ్., టీం "C"   ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ
2. సి హెచ్. నాగరాజు,  ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఎస్. టి. ఎఫ్,   టీం "D" ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ
3. ఎస్. జ్యోతి, P&ESI, ఎస్ టి ఎఫ్., టీం "D"
4. జి. వెంకట్ రెడ్డి, P&ESI, మేడ్చల్ 
5. MD. మౌల అలీ.  కానిస్టేబుల్ ఎస్ . టి. ఎఫ్., టీం "C"   ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ
6. వేణు కుమార్ కానిస్టేబుల్ ఎస్ టి ఎఫ్ టీం "C"   ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ
7. ఆర్. లోకేష్,  కానిస్టేబుల్,  ఎస్ టి ఎఫ్,  టీం "C"   ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ
8. పి. చరణ్, కానిస్టేబుల్,  ఎస్ టి ఎఫ్,  టీం "C"   ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ
9. కె. శశి కిరణ్ , కానిస్టేబుల్,  ఎస్ టి ఎఫ్,  టీం "D"    ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ
10. పి. వినోద్,  కానిస్టేబుల్,  ఎస్ టి ఎఫ్,  టీం "D"   ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ
11.  శివ, డ్రైవర్, ఎస్ టి ఎఫ్,  టీం "C"   
12. రమేష్,  డ్రైవర్,  ఎస్ టి ఎఫ్,  టీం "D"   
ని అభినందించడం జరిగింది.

IMG-20250428-WA0148

Tags:

Advertisement

Latest News

కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన గాయత్రీ టవర్స్ వ్యాపారులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన గాయత్రీ టవర్స్ వ్యాపారులు
గాయత్రీ టవర్స్ వ్యాపారులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జమ్మూకాశ్మీర్రాష్ట్రంలోని పహేల్గామ్ లో పర్యాటకులైన 28 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ముష్కరులను నిందిస్తూ, భారత్ మాతాకీ జై...
అల్కోబెవ్‌ ఇండియా సదస్సుకు ఎక్సైజ్‌ కమిషనర్‌ హాజరు
అట్రాసిటీ కేసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. చైర్మన్ బక్కి వెంకటయ్య
కేటీఆర్ కు హైకోర్టులో ఊరట.. బంజారాహిల్స్ కేసు కొట్టివేసిన కోర్ట్
శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడి.. లంచం తీసుకుంటూ చిక్కిన ఎస్ఐ
మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలని బీజేపీ ధర్నా
మాదకద్రవ్యాల రవాణా అరికట్టడంలో ఎక్సైజ్ సిబ్బంది పనితీరు భేష్.. డైరెక్టర్ కమలాసన్ రెడ్డి