పెనుగుదురు గ్రామ స్మశాన వాటికలో సౌకర్యాల కొరత..!
కాకినాడు జిల్లా పెనుగుదురు గ్రామంలోని స్మశాన వాటికలో తగిన సౌకర్యాల లేకపోవడం గ్రామ ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. ప్రత్యేకంగా, అంత్యక్రియల అనంతరం స్నానం చేయడానికి ఏర్పాటు చేసిన వాటర్ ట్యాప్లు తుప్పు పట్టి, నిర్వహణ లేకపోవడంతో ఉపయోగించలేని పరిస్థితిలో ఉన్నాయి. ఈ సమస్యను గ్రామ యువకులు, పబ్బినిడి హరిబాబు గుర్తించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పంచాయతీ పరిధిలో ఉన్న ఈ స్మశాన వాటికలో నిర్వహణ లోపం వల్ల గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
గ్రామంలో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ, నిర్వహణ లోపం వల్ల గ్రామ ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నారు. స్మశాన వాటికలో తగిన సౌకర్యాలు కల్పించి, వాటర్ ట్యాప్లను మరమ్మత్తు చేయించి, గ్రామ ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.