పాతబస్తీలో ఈడీ అధికారుల సోదాలు.. పలు వ్యాపారుల ఇండ్లల్లో తనిఖీలు

By Ravi
On
పాతబస్తీలో ఈడీ అధికారుల సోదాలు.. పలు వ్యాపారుల ఇండ్లల్లో తనిఖీలు

పాతబస్తీలో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. మహేశ్వరంలో బుధాన్ ల్యాండ్ ను అక్రమం గా లే అవుట్ చేసి అమ్మకం చేసిన వ్యాపారులు మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా విక్రయాలు జరిపినట్లు ఈడీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఆ డబ్బును పలు కంపెనీలకు  బదలాయింపు చేసినట్లు అనుమానించిన ఈడీ అధికారులు తెల్లవారుజామున నుండి పాత బస్తీలోని సంతోష్ నగర్ ప్రాంతంలో నివసించే  మున్వర్ ఖాన్ , ఖదీర్ ఉన్నిస్సా, సర్ఫాన్, సుకుమార్  ఇండ్లల్లో భారీ బందోబస్తు నడుమసోదాలు చేస్తున్నారు.గతంలో  ఇదే కేసులో ఐఏఎస్  అమోయ్ కుమార్ ని సైతం ఈడీ విచారణ చేసింది.

Tags:

Advertisement

Latest News